నకిలీల పట్ల జాగ్రత్త.. ప్రవాసులను హెచ్చరించిన ఇండియన్ ఎంబసీ
- August 17, 2022
యూఏఈ: మోసపూరిత సోషల్ మీడియా హ్యాండిల్, ఇమెయిల్ ID గురించి ప్రవాసులను యూఏఈలోని భారతీయ రాయబార కార్యాలయం హెచ్చరించింది. కొంతమంది వ్యక్తులు భారతీయ పౌరులను మోసం చేయడానికి @embassy_help (Twitter), [email protected]ని ఉపయోగిస్తున్నారని ఎంబసీ పేర్కొంది. యూఏఈ నుండి భారతదేశానికి ప్రవాసుల ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తామని నేరస్థులు సందేశాలు పంపడం, డబ్బు వసూలు చేయడం ద్వారా మోసానికి పాల్పడతారని తెలిపింది. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి మోసగాళ్లు వినియోగిస్తున్న ట్విట్టర్ హ్యాండిల్ @embassy_help , ఇమెయిల్ ఐడి [email protected]తో ఎలాంటి అనుబంధం లేదని ఎంబసీ స్పష్టం చేసింది. అన్ని అధికారిక ఇమెయిల్ ఐడిలు, ట్విట్టర్ హ్యాండిల్, ఫేస్బుక్ ఐడి, టెలిఫోన్ నంబర్లు తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నట్లు ఎంబసీ తెలిపింది. @IndembAbuDhabi ఏకైక అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ అని రాయబార కార్యాలయం తెలిపింది.
--సుమన్ కొల్లగొట్ల(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







