నకిలీల పట్ల జాగ్రత్త.. ప్రవాసులను హెచ్చరించిన ఇండియన్ ఎంబసీ
- August 17, 2022
యూఏఈ: మోసపూరిత సోషల్ మీడియా హ్యాండిల్, ఇమెయిల్ ID గురించి ప్రవాసులను యూఏఈలోని భారతీయ రాయబార కార్యాలయం హెచ్చరించింది. కొంతమంది వ్యక్తులు భారతీయ పౌరులను మోసం చేయడానికి @embassy_help (Twitter), [email protected]ని ఉపయోగిస్తున్నారని ఎంబసీ పేర్కొంది. యూఏఈ నుండి భారతదేశానికి ప్రవాసుల ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తామని నేరస్థులు సందేశాలు పంపడం, డబ్బు వసూలు చేయడం ద్వారా మోసానికి పాల్పడతారని తెలిపింది. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి మోసగాళ్లు వినియోగిస్తున్న ట్విట్టర్ హ్యాండిల్ @embassy_help , ఇమెయిల్ ఐడి [email protected]తో ఎలాంటి అనుబంధం లేదని ఎంబసీ స్పష్టం చేసింది. అన్ని అధికారిక ఇమెయిల్ ఐడిలు, ట్విట్టర్ హ్యాండిల్, ఫేస్బుక్ ఐడి, టెలిఫోన్ నంబర్లు తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నట్లు ఎంబసీ తెలిపింది. @IndembAbuDhabi ఏకైక అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ అని రాయబార కార్యాలయం తెలిపింది.
--సుమన్ కొల్లగొట్ల(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







