నకిలీల పట్ల జాగ్రత్త.. ప్రవాసులను హెచ్చరించిన ఇండియన్ ఎంబసీ
- August 17, 2022
యూఏఈ: మోసపూరిత సోషల్ మీడియా హ్యాండిల్, ఇమెయిల్ ID గురించి ప్రవాసులను యూఏఈలోని భారతీయ రాయబార కార్యాలయం హెచ్చరించింది. కొంతమంది వ్యక్తులు భారతీయ పౌరులను మోసం చేయడానికి @embassy_help (Twitter), [email protected]ని ఉపయోగిస్తున్నారని ఎంబసీ పేర్కొంది. యూఏఈ నుండి భారతదేశానికి ప్రవాసుల ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తామని నేరస్థులు సందేశాలు పంపడం, డబ్బు వసూలు చేయడం ద్వారా మోసానికి పాల్పడతారని తెలిపింది. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి మోసగాళ్లు వినియోగిస్తున్న ట్విట్టర్ హ్యాండిల్ @embassy_help , ఇమెయిల్ ఐడి [email protected]తో ఎలాంటి అనుబంధం లేదని ఎంబసీ స్పష్టం చేసింది. అన్ని అధికారిక ఇమెయిల్ ఐడిలు, ట్విట్టర్ హ్యాండిల్, ఫేస్బుక్ ఐడి, టెలిఫోన్ నంబర్లు తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నట్లు ఎంబసీ తెలిపింది. @IndembAbuDhabi ఏకైక అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ అని రాయబార కార్యాలయం తెలిపింది.
--సుమన్ కొల్లగొట్ల(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







