రాబోయే నాలుగేళ్లకు ఎఫ్టీపీ ప్రకటించిన ఐసీసీ..
- August 17, 2022రాబోయే నాలుగేళ్లకు ఎఫ్టీపీ ప్రకటించిన ఐసీసీ..భారీగా పెరిగిన మ్యాచ్లు పురుషుల క్రికెట్కు సంబంధించి వచ్చే నాలుగేళ్లలో ఆడనున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP)ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. 2023-2027 కాలానికి గానూ అంతర్జాతీయంగా వివిధ జట్లు ఆడే టూర్ల షెడ్యూల్ను గురువారం(ఆగస్టు 17,2022) విడుదల చేసింది.
గతంతో పోలిస్తే కొత్త ఎఫ్టీపీలో అన్ని ఫార్మాట్ల మ్యాచ్ల సంఖ్యలు గణనీయంగా పెరిగాయి. 2019-23 ఎఫ్టీపీలో అన్ని జట్లు కలిపి 151 టెస్టులు, 241 వన్డేలు, 301 టీ20లు ఆడాల్సి ఉండగా.. ఐసీసీ 2023-27లో వీటి సంఖ్య మరింత పెంచింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. నాలుగేళ్ల కాలంలో 173 టెస్టులు, 281 వన్డేలు, 326 టీ20లు ఉన్నాయి.
మొత్తంగా నాలుగేళ్లలో 777 అంతర్జాతీయ మ్యాచ్లు జరుగుతాయి. గతంతో పోలిస్తే ఈ సైకిల్లో పురుషుల క్రికెట్ జట్లు 87 మ్యాచ్లు ఎక్కువ ఆడాల్సి ఉంది. ఇక ఈ నాలుగేళ్లలోనే ఒక వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 ప్రపంచకప్లు, రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ కూడా జరుగనున్నాయి.
భారత్ విషయానికొస్తే.. 2023-25 కాలంలో రోహిత్ శర్మ అండ్ కో.. స్వదేశంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్లతో టెస్టులు ఆడనుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లనుంది. 2025-27 సైకిల్లో ఆసీస్, విండీస్, సౌతాఫ్రికాలు భారత పర్యటనకు వస్తాయి. భారత్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, సఫారీ పర్యటనలకు వెళ్లనుంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..