రాబోయే నాలుగేళ్లకు ఎఫ్టీపీ ప్రకటించిన ఐసీసీ..
- August 17, 2022
రాబోయే నాలుగేళ్లకు ఎఫ్టీపీ ప్రకటించిన ఐసీసీ..భారీగా పెరిగిన మ్యాచ్లు పురుషుల క్రికెట్కు సంబంధించి వచ్చే నాలుగేళ్లలో ఆడనున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP)ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. 2023-2027 కాలానికి గానూ అంతర్జాతీయంగా వివిధ జట్లు ఆడే టూర్ల షెడ్యూల్ను గురువారం(ఆగస్టు 17,2022) విడుదల చేసింది.
గతంతో పోలిస్తే కొత్త ఎఫ్టీపీలో అన్ని ఫార్మాట్ల మ్యాచ్ల సంఖ్యలు గణనీయంగా పెరిగాయి. 2019-23 ఎఫ్టీపీలో అన్ని జట్లు కలిపి 151 టెస్టులు, 241 వన్డేలు, 301 టీ20లు ఆడాల్సి ఉండగా.. ఐసీసీ 2023-27లో వీటి సంఖ్య మరింత పెంచింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. నాలుగేళ్ల కాలంలో 173 టెస్టులు, 281 వన్డేలు, 326 టీ20లు ఉన్నాయి.
మొత్తంగా నాలుగేళ్లలో 777 అంతర్జాతీయ మ్యాచ్లు జరుగుతాయి. గతంతో పోలిస్తే ఈ సైకిల్లో పురుషుల క్రికెట్ జట్లు 87 మ్యాచ్లు ఎక్కువ ఆడాల్సి ఉంది. ఇక ఈ నాలుగేళ్లలోనే ఒక వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు టీ20 ప్రపంచకప్లు, రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ కూడా జరుగనున్నాయి.
భారత్ విషయానికొస్తే.. 2023-25 కాలంలో రోహిత్ శర్మ అండ్ కో.. స్వదేశంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్లతో టెస్టులు ఆడనుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లనుంది. 2025-27 సైకిల్లో ఆసీస్, విండీస్, సౌతాఫ్రికాలు భారత పర్యటనకు వస్తాయి. భారత్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, సఫారీ పర్యటనలకు వెళ్లనుంది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







