ప్రబాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్: కానీ, ఇప్పుడు కాదుగా.!
- August 17, 2022
‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రబాస్, ఆ తర్వాత చేసిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’ సినిమాలతో తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ డిజప్పాయింట్మెంట్ తీర్చేందుకు, ఆ తర్వాత వరుసగా సినిమాలు లైన్లో పెట్టేశాడు ప్రబాస్.
ప్రబాస్ ఓకే చేసిన సినిమాలన్నీ సెట్స్ పైనే వుండడం విశేషం. కానీ, అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో, ఇప్పుడప్పుడే వీటిలో ఏ సినిమాలూ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
పౌరాణీకం నేపథ్యంలో రూపొందుతోన్న ‘ఆది పురుష్’ సినిమా దాదాపు పూర్తయిపోయిందంటున్నారు. కానీ, భారీ వీఎఫ్ఎక్స్ పనులతో ఈ సినిమా రిలీజ్ ఇంకా ఆలస్యం కానుందట. కృతి సనన్ హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో. ఈ ఏడాది చివరికల్లా ‘ఆది పురుష్’ని ధియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా, మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘సలార్’ వచ్చే ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ కానుందనీ లేటెస్ట్గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం ‘ప్రాజెక్ట్ కె’ మూవీని వచ్చే ఏడాది అక్టోబర్ 18న రిలీజ్ చేయబోతున్నారనీ తెలుస్తోంది.
అంటే, ఒక్క నెల గ్యాప్లో ప్రబాస్ నుంచి రెండు భారీ చిత్రాలు రాబోతున్నాయన్న మాట. టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. చైనా, అమెరికా టార్గెట్గా ఈ సినిమాని భారీ విజువల్ ఎఫెక్ట్స్తో రూపొందిస్తున్నారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుండగా, బాలీవుడ్ భామలు దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







