దిల్ రాజు ఫ్రస్టేషన్: సోషల్ మీడియాతో ఆటలా.?
- August 17, 2022‘కార్తికేయ 2’ సినిమాపై టాలీవుడ్లో కొందరు కావాలనే బురద చల్లే ప్రయత్నం చేశారనీ, కావాలనే సినిమాని తొక్కేశారనే ప్రచారం జరిగింది. అందులో కీలకమైన భాగస్వామ్యం నిర్మాత దిల్ రాజుదే అనే ప్రచారం కూడా వుంది.
వాయిదాల పర్వంతో సతమతమైన ‘కార్తికేయ 2’, ఎట్టకేలకు రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే, రిలీజ్ తర్వాత కూడా ఈ సినిమాని వాయిదా వేసినందుకు రచ్చ ఆగలేదు.
నెట్టింట ట్రోలింగ్ జురగుతూనే వుంది. దాంతో, దిల్ రాజు బయటికి వచ్చారు. తన తప్పేం లేదంటూ, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాపై దారుణంగా చురకలంటించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ఏది పడితే అది రాసేస్తే కుదరదనీ, హెచ్చరించారు. అంతేకాడు, వాస్తవాలు తెలిస్తే రాయండి. లేదంటే మూస్కోండి.. అంటూ సోషల్ మీడియాపై స్ర్టాంగ్ కౌంటర్స్ వేశారు.
నిఖిల్ తనకు ఆప్తుడనీ, పీపుల్స్ మీడియా సంస్థతో తనకెంతో మంచి అనుబంధం వుందనీ, అయినా, అది టాలీవుడ్లో బెస్ట్ పొజిషన్లో వున్న నిర్మాణ సంస్థ అనీ, దాన్నిఆపే దమ్ము ఎవరికి వుందంటూ, రాసే ముందు కాస్తయినా కామన్సెన్స్ యూజ్ చేయాలనీ ఫైర్ అయ్యారు దిల్ రాజు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్