దిల్ రాజు ఫ్రస్టేషన్: సోషల్ మీడియాతో ఆటలా.?
- August 17, 2022
‘కార్తికేయ 2’ సినిమాపై టాలీవుడ్లో కొందరు కావాలనే బురద చల్లే ప్రయత్నం చేశారనీ, కావాలనే సినిమాని తొక్కేశారనే ప్రచారం జరిగింది. అందులో కీలకమైన భాగస్వామ్యం నిర్మాత దిల్ రాజుదే అనే ప్రచారం కూడా వుంది.
వాయిదాల పర్వంతో సతమతమైన ‘కార్తికేయ 2’, ఎట్టకేలకు రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే, రిలీజ్ తర్వాత కూడా ఈ సినిమాని వాయిదా వేసినందుకు రచ్చ ఆగలేదు.
నెట్టింట ట్రోలింగ్ జురగుతూనే వుంది. దాంతో, దిల్ రాజు బయటికి వచ్చారు. తన తప్పేం లేదంటూ, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాపై దారుణంగా చురకలంటించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ఏది పడితే అది రాసేస్తే కుదరదనీ, హెచ్చరించారు. అంతేకాడు, వాస్తవాలు తెలిస్తే రాయండి. లేదంటే మూస్కోండి.. అంటూ సోషల్ మీడియాపై స్ర్టాంగ్ కౌంటర్స్ వేశారు.
నిఖిల్ తనకు ఆప్తుడనీ, పీపుల్స్ మీడియా సంస్థతో తనకెంతో మంచి అనుబంధం వుందనీ, అయినా, అది టాలీవుడ్లో బెస్ట్ పొజిషన్లో వున్న నిర్మాణ సంస్థ అనీ, దాన్నిఆపే దమ్ము ఎవరికి వుందంటూ, రాసే ముందు కాస్తయినా కామన్సెన్స్ యూజ్ చేయాలనీ ఫైర్ అయ్యారు దిల్ రాజు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







