దోఫర్ ఖరీఫ్ సీజన్‌లో ప్రయాణించిన 315,000 మంది

- August 18, 2022 , by Maagulf
దోఫర్ ఖరీఫ్ సీజన్‌లో ప్రయాణించిన 315,000 మంది

మస్కట్ : జూన్ ప్రారంభం నుండి ఆగస్టు 13 వరకు దోఫర్ ఖరీఫ్ సీజన్‌లో 315,000 మంది ప్రయాణికులు సలాలా విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు.  ఇదే సమయంలో ఇన్‌కమింగ్/అవుట్‌గోయింగ్ విమానాల సంఖ్య వారానికి 195 విమానాలకు చేరుకుందని సలాలా ఎయిర్‌పోర్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సలీమ్ బిన్ అవద్ అల్ యాఫీ తెలిపారు. ఈ వేసవిలో అరేబియా గల్ఫ్‌లోని పర్యాటక ప్రదేశాలలో గవర్నరేట్ ఒకటిగా మారిందని ఆయన పేర్కొన్నారు. అబుదాబి, బహ్రెయిన్ నుండి వారానికి రెండు విమానాలు(గల్ఫ్ ఎయిర్),  కువైట్ నుండి వారానికి 6 విమానాలు(జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్), సౌదీ అరేబియాలోని రియాద్ నుండి వారానికి 4 విమానాలు నడుస్తున్నాయన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com