దోఫర్ ఖరీఫ్ సీజన్లో ప్రయాణించిన 315,000 మంది
- August 18, 2022మస్కట్ : జూన్ ప్రారంభం నుండి ఆగస్టు 13 వరకు దోఫర్ ఖరీఫ్ సీజన్లో 315,000 మంది ప్రయాణికులు సలాలా విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు. ఇదే సమయంలో ఇన్కమింగ్/అవుట్గోయింగ్ విమానాల సంఖ్య వారానికి 195 విమానాలకు చేరుకుందని సలాలా ఎయిర్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సలీమ్ బిన్ అవద్ అల్ యాఫీ తెలిపారు. ఈ వేసవిలో అరేబియా గల్ఫ్లోని పర్యాటక ప్రదేశాలలో గవర్నరేట్ ఒకటిగా మారిందని ఆయన పేర్కొన్నారు. అబుదాబి, బహ్రెయిన్ నుండి వారానికి రెండు విమానాలు(గల్ఫ్ ఎయిర్), కువైట్ నుండి వారానికి 6 విమానాలు(జజీరా ఎయిర్వేస్, కువైట్ ఎయిర్వేస్), సౌదీ అరేబియాలోని రియాద్ నుండి వారానికి 4 విమానాలు నడుస్తున్నాయన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత