డ్రైవింగ్లో వ్యర్థాల పారబోత.. 1,000 దిర్హామ్ జరిమానా, 6 బ్లాక్ పాయింట్లు
- August 19, 2022
యూఏఈ: ఎమిరేట్లో ప్రయాణిస్తున్న సమయాల్లో వాహనాల్లోని చెత్తను రోడ్లపై, ప్రజా సౌకర్యాలపై విసిరినందుకు అబుదాబిలో మొత్తం 162 మంది వాహనదారులకు జరిమానా విధించారు. 2022 మొదటి ఆరు నెలల్లో వాహనాల నుంచి వ్యర్థాలను రోడ్డుపై వేస్తూ పలువురు డ్రైవర్లు పట్టుబడ్డారని అబుదాబి పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వ్యర్థాలను రోడ్డుపై విసిరినందుకు వారికి 1,000 దిర్హామ్ ల జరిమానాతోపాటు ఆరు బ్లాక్ పాయింట్లు విధించారు. నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే చెత్తను, వ్యర్థాలను వేయాలని అధికారులు సూచించారు. పర్యావరణ భద్రత, ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వాహనదారులను కోరారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాల నుంచి ఎలాంటి వ్యర్థాలు వేయకుండా ప్రయాణికులను హెచ్చరించాలని డ్రైవర్లకు సూచించారు.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







