డ్రైవింగ్లో వ్యర్థాల పారబోత.. 1,000 దిర్హామ్ జరిమానా, 6 బ్లాక్ పాయింట్లు
- August 19, 2022
యూఏఈ: ఎమిరేట్లో ప్రయాణిస్తున్న సమయాల్లో వాహనాల్లోని చెత్తను రోడ్లపై, ప్రజా సౌకర్యాలపై విసిరినందుకు అబుదాబిలో మొత్తం 162 మంది వాహనదారులకు జరిమానా విధించారు. 2022 మొదటి ఆరు నెలల్లో వాహనాల నుంచి వ్యర్థాలను రోడ్డుపై వేస్తూ పలువురు డ్రైవర్లు పట్టుబడ్డారని అబుదాబి పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వ్యర్థాలను రోడ్డుపై విసిరినందుకు వారికి 1,000 దిర్హామ్ ల జరిమానాతోపాటు ఆరు బ్లాక్ పాయింట్లు విధించారు. నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే చెత్తను, వ్యర్థాలను వేయాలని అధికారులు సూచించారు. పర్యావరణ భద్రత, ప్రజారోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వాహనదారులను కోరారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాల నుంచి ఎలాంటి వ్యర్థాలు వేయకుండా ప్రయాణికులను హెచ్చరించాలని డ్రైవర్లకు సూచించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







