శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత
- August 19, 2022
హైదరాబాద్: విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకు వస్తున్న ప్రయాణికుడిని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి 436 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను శనివారం తనిఖీలు చేస్తున్నారు.షార్జా నుండి హైదరాబాద్ వచ్చిన ఒక వ్యక్తి వద్ద 436 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించారు.ఎలక్ట్రిక్ బ్లెండర్స్ లో బంగారం అమర్చి తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కిన స్మగ్లర్.
వ్యక్తి వద్ద బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితులను విచారణ చేపట్టారు. ఇద్దరి వద్ద పట్టుబడ్డ బంగారం విలువ షుమారు రూ.23,14,200 లక్షలకు పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.
--శ్రీనివాస్ మంచర్ల(మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







