వెంక‌య్య‌నాయుడుతో అమిత్ షా భేటీ

- August 24, 2022 , by Maagulf
వెంక‌య్య‌నాయుడుతో అమిత్ షా భేటీ

న్యూఢిల్లీ: మాజీ ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ఢిల్లీలో కలిశారు. వెంక‌య్య ఇంటికే వెళ్లిన అమిత్ షా ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అమిత్ షానే సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించారు. వెంక‌య్య‌తో తాను భేటీ అయిన ఫొటోల‌ను కూడా అమిత్ షా పంచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా వెంక‌య్య‌ను మాజీ ఉప‌రాష్ట్రప‌తిగానే కాకుండా త‌మ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌గానూ అమిత్ షా అభివ‌ర్ణించారు. వెంక‌య్య‌ను క‌ల‌వడం త‌న‌కు ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంద‌ని తెలిపిన అమిత్ షా.. ఉప‌రాష్ట్రప‌తిగా వెంక‌య్య అనుభ‌వాల గురించి అడిగి తెలుసుకున్న‌ట్లు తెలిపారు. అంతేకాకుండా దేశ ప్ర‌గ‌తిపైనా వెంక‌య్య‌తో చ‌ర్చించిన‌ట్లు అమిత్ షా వెల్ల‌డించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com