షేక్ మొహమ్మద్ పాలనకు 101 రోజులు
- August 25, 2022
యూఏఈ: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 101 రోజులు పూర్తయిన సందర్భంగా ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అభినందనలు తెలిపారు. ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ మే 14న యూఏఈ మూడవ అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలినిందే. మే 13న 73వ ఏట మరణించిన తన సోదరుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. జూలై 2022లో షేక్ మొహమ్మద్ తక్కువ-ఆదాయ పౌరుల కోసం సామాజిక మద్దతు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన బడ్జెట్ను Dh14 బిలియన్ నుండి Dh28 బిలియన్లకు పెంచారు. ఈ ఫండ్ ద్వారా గృహనిర్మాణం, విశ్వవిద్యాలయ విద్య, 45 ఏళ్లు పైబడిన నిరుద్యోగ పౌరులకు కొత్త పథకాలను రూపకల్పన చేశారు. అలాగే ఇంధనం, ఆహారం, నీరు, విద్యుత్తు కోసం సబ్సిడీలను కూడా ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా పరిమిత ఆదాయం ఉన్న పౌరులకు మంచి జీవనోపాధిని కల్పించాలనే ఉద్దేశించి అలవెన్సులను ప్రకటించారని షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన అభినందన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







