మహజూజ్ ర్యాఫిల్ డ్రా: ఇద్దరు భారతీయులకు జాక్పాట్..
- August 25, 2022
దుబాయ్: మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో మరో ఇద్దరు భారతీయులకు జాక్పాట్ తగిలిగింది. తాజాగా నిర్వహించిన మహజూజ్ 90వ వీక్లీ డ్రాలో డేవిడ్, రాబర్ట్ అనే ఇద్దరు భారత వ్యక్తులు చెరో 1లక్ష దిర్హాములు గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకులో ఐటీ మేనేజర్గా పని చేస్తున్న 39 ఏళ్ల డేవిడ్ తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి ఆరేళ్ల నుంచి యూఏఈలో నివాసం ఉంటున్నాడు.స్నేహితుల సూచన మేరకు 2021 ఆగస్టు నుంచి మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నాడు.ఇప్పటివరకు మొత్తం నాలుగు సార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే, నాలుగో సారికే ఆయనకు అదృష్టం వరించింది. దాంతో తాజాగా నిర్వహించిన డ్రాలో అతడు 1లక్ష దిర్హాములు గెలుచుకున్నాడు. ఇంత భారీ మొత్తం గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన డేవిడ్.. ఈ నగదును తన ఫ్యామిలీ భవిష్యత్ కోసం వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు.
మరో విజేత రాబర్ట్ (55) గత 20 ఏళ్ల నుంచి యూఏఈ ఉంటున్నట్లు తెలిపాడు. దుబాయ్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఆర్థిక సలహాదారుగా పనిచేసే రాబర్ట్ 2021 అక్టోబర్ నుంచి క్రమం తప్పకుండా మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నాడు. కానీ, ఇంత త్వరగా తనకు జాక్పాట్ తగులుతుందని అనుకోలేదని, భార నగదు గెలవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. తాను గెలిచిన ఈ భారీ మొత్తాన్ని ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నాడు. కానీ, ఇందులో కొంత భాగాన్ని తప్పకుండా తన పిల్లల చదువులకు ఉపయోగిస్తానని తెలిపాడు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







