మహజూజ్ ర్యాఫిల్ డ్రా: ఇద్దరు భారతీయులకు జాక్పాట్..
- August 25, 2022
దుబాయ్: మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో మరో ఇద్దరు భారతీయులకు జాక్పాట్ తగిలిగింది. తాజాగా నిర్వహించిన మహజూజ్ 90వ వీక్లీ డ్రాలో డేవిడ్, రాబర్ట్ అనే ఇద్దరు భారత వ్యక్తులు చెరో 1లక్ష దిర్హాములు గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకులో ఐటీ మేనేజర్గా పని చేస్తున్న 39 ఏళ్ల డేవిడ్ తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి ఆరేళ్ల నుంచి యూఏఈలో నివాసం ఉంటున్నాడు.స్నేహితుల సూచన మేరకు 2021 ఆగస్టు నుంచి మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నాడు.ఇప్పటివరకు మొత్తం నాలుగు సార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే, నాలుగో సారికే ఆయనకు అదృష్టం వరించింది. దాంతో తాజాగా నిర్వహించిన డ్రాలో అతడు 1లక్ష దిర్హాములు గెలుచుకున్నాడు. ఇంత భారీ మొత్తం గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన డేవిడ్.. ఈ నగదును తన ఫ్యామిలీ భవిష్యత్ కోసం వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు.
మరో విజేత రాబర్ట్ (55) గత 20 ఏళ్ల నుంచి యూఏఈ ఉంటున్నట్లు తెలిపాడు. దుబాయ్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఆర్థిక సలహాదారుగా పనిచేసే రాబర్ట్ 2021 అక్టోబర్ నుంచి క్రమం తప్పకుండా మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నాడు. కానీ, ఇంత త్వరగా తనకు జాక్పాట్ తగులుతుందని అనుకోలేదని, భార నగదు గెలవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. తాను గెలిచిన ఈ భారీ మొత్తాన్ని ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నాడు. కానీ, ఇందులో కొంత భాగాన్ని తప్పకుండా తన పిల్లల చదువులకు ఉపయోగిస్తానని తెలిపాడు.
తాజా వార్తలు
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!







