వస్తువులను కొనాలని చెప్పే హక్కు విక్రేతకు లేదు
- August 26, 2022
రియాద్: కస్టమర్లు రెండు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని లేదా ఒక ఉత్పత్తి విక్రయాన్ని మరొకదానికి లింక్ చేయాలని చేప్పే హక్కు విక్రేతకు లేదని వాణిజ్య మంత్రిత్వ శాఖ (MOC) స్పష్టం చేసింది. కస్టమర్ హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వారంవారీ ప్రచారంలో భాగంగా మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రచురించిన ఇన్ఫోగ్రాఫిక్లో ఈ మేరకు వివరణ ఇచ్చింది. అయితే ఈ నిబంధనకు రెండు మినహాయింపులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దుకాణం నిర్దిష్ట ఉత్పత్తిని కొనుగోలు చేసేటప్పుడు ఒక వస్తువును ఉచితంగా పొందే ఆఫర్ను ప్రకటించినట్లయితే, దుకాణాలు లేదా విక్రేతలు ఈ పద్ధతిని ఉపయోగించడానికి అనుమతించబడతారని తెలిపింది. అలాగే ఉత్పత్తి యొక్క బ్రోచర్ లేదా కేటలాగ్ రెండు అంశాలు ఒకదానికొకటి లింక్ చేసినప్పుడు మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుందని పేర్కొంది. మరింత సమాచారం కోసం వెబ్సైట్ https://dalil.mc.gov.sa/ ను చూడాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







