ఆసియా కప్ 2022: పాక్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
- August 29, 2022
దుబాయ్: ఆసియా కప్ 2022 టీ20 టోర్నీలో భారత్ బోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో టీమిండియా గెలుపొందింది. 5 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది భారత్. పాక్ నిర్దేశించిన 148 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. బౌలింగ్ లో మెరిసిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ లోనూ చెలరేగాడు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.
పాండ్య 17 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లి (34 బంతుల్లో 35 పరుగులు), రవీంద్ర జడేజా(29 బంతుల్లో 35 పరుగులు) రాణించారు. సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 18 పరుగులు), కెప్టెన్ రోహిత్ శర్మ(18 బంతుల్లో 12 పరుగులు) చేశారు. కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు.
భారత బౌలర్ల మాదిరే పాక్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. దీంతో మనోళ్లు పరుగులు చేయడానికి కొంత ఇబ్బంది పడ్డారు. అయితే జడేజా, పాండ్యలు రాణించడంతో భారత్ గెలుపొందింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ నవాజ్ 3 వికెట్లు, నసీమ్ షా 2 వికెట్లు తీశారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







