ఆసియా కప్ 2022: పాక్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
- August 29, 2022
దుబాయ్: ఆసియా కప్ 2022 టీ20 టోర్నీలో భారత్ బోణీ కొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన పోరులో టీమిండియా గెలుపొందింది. 5 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది భారత్. పాక్ నిర్దేశించిన 148 పరుగుల టార్గెట్ ను 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. బౌలింగ్ లో మెరిసిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్ లోనూ చెలరేగాడు. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.
పాండ్య 17 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లి (34 బంతుల్లో 35 పరుగులు), రవీంద్ర జడేజా(29 బంతుల్లో 35 పరుగులు) రాణించారు. సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 18 పరుగులు), కెప్టెన్ రోహిత్ శర్మ(18 బంతుల్లో 12 పరుగులు) చేశారు. కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు.
భారత బౌలర్ల మాదిరే పాక్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. దీంతో మనోళ్లు పరుగులు చేయడానికి కొంత ఇబ్బంది పడ్డారు. అయితే జడేజా, పాండ్యలు రాణించడంతో భారత్ గెలుపొందింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ నవాజ్ 3 వికెట్లు, నసీమ్ షా 2 వికెట్లు తీశారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







