భారత్ కరోనా అప్డేట్
- August 29, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. చాలా కాలం తర్వాత కొత్త కేసులు 8 వేల దిగువకు వచ్చాయి. దేశంలో కొత్తగా 7,591 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో దేశంలో 9,206 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 84,931గా ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.58 శాతంగా ఉందని చెప్పింది.
వారాంతపు పాజిటివిటీ రేటు 2.69 శాతం ఉందని తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో కోలుకున్న వారి సంఖ్య మొత్తం కలిపి 4,38,02,993 ఉందని చెప్పింది. ఇప్పటివరకు మొత్తం 88.52 కోట్ల కరోనా పరీక్షలు చేశారని వివరించింది. నిన్న దేశంలో 1,65,751 కరోనా పరీక్షలు చేశారని తెలిపింది.
దేశంలో ఇప్పటివరకు 211.91 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. వాటిలో రెండో డోసుల సంఖ్య 94.19 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. బూస్టర్ డోసులు 15.43 కోట్లు ఉన్నాయని చెప్పింది. నిన్న దేశంలో 24,70,330 డోసుల వ్యాక్సిన్లు వేశామని పేర్కొంది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







