భారత్ కరోనా అప్డేట్
- August 29, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. చాలా కాలం తర్వాత కొత్త కేసులు 8 వేల దిగువకు వచ్చాయి. దేశంలో కొత్తగా 7,591 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గత 24 గంటల్లో దేశంలో 9,206 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 84,931గా ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.58 శాతంగా ఉందని చెప్పింది.
వారాంతపు పాజిటివిటీ రేటు 2.69 శాతం ఉందని తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో కోలుకున్న వారి సంఖ్య మొత్తం కలిపి 4,38,02,993 ఉందని చెప్పింది. ఇప్పటివరకు మొత్తం 88.52 కోట్ల కరోనా పరీక్షలు చేశారని వివరించింది. నిన్న దేశంలో 1,65,751 కరోనా పరీక్షలు చేశారని తెలిపింది.
దేశంలో ఇప్పటివరకు 211.91 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. వాటిలో రెండో డోసుల సంఖ్య 94.19 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. బూస్టర్ డోసులు 15.43 కోట్లు ఉన్నాయని చెప్పింది. నిన్న దేశంలో 24,70,330 డోసుల వ్యాక్సిన్లు వేశామని పేర్కొంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







