లెహెంగా బటన్స్లో 41 లక్షల క్యాష్..
- August 30, 2022
న్యూ ఢిల్లీ: విదేశాలకు అక్రమంగా నగలు, డబ్బు తీసుకెళ్లేందుకు కొందరు కొత్త దారులు వెతుకుతుంటారు. అయితే, ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రకంగా దొరికిపోతుంటారు. తాజాగా అక్రమంగా నగదు తీసుకెళ్లేందుకు కొత్త ప్లాన్ వేసిన ఒక వ్యక్తి ఎయిర్పోర్టు అధికారులకు దొరికిపోయాడు. అతడి ప్లాన్ చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.
మిసామ్ రజా అనే వ్యక్తి మంగళవారం స్పైస్ జెట్ విమానంలో ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్పోర్టులో అతడి లగేజీ తనిఖీ నిర్వహిస్తున్న ఎయిర్పోర్టు అధికారులకు మిసామ్ ప్రవర్తన కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది. దీంతో మరింత జాగ్రత్తగా అతడి లగేజీని పరిశీలించారు. మొత్తం లగేజీని ఎక్స్-రే బ్యాగేజ్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ద్వారా పరిశీలించగా దిమ్మదిరిగే విషయం వెలుగు చూసింది. లెహెంగా బటన్స్లో భారీగా నగదు దాచిన విషయాన్ని అధికారులు గుర్తించారు. 1,85,500 విలువైన సౌదీ రియల్ కరెన్సీ నోట్లను బటన్స్ లోపల, చిన్నగా మడిచి పెట్టాడు.
వాటి మొత్తం విలువ మన కరెన్సీలో దాదాపు రూ.41 లక్షల వరకు ఉంటుంది.ఒక్కో బటన్ ఓపెన్ చేసిన అధికారులు అంత పెద్ద మొత్తంలో నగదు బయటపడటం చూసి ఆశ్చర్యపోయారు. మిసాబ్ ఈ నగదుకు సంబంధించిన వివరాల్ని చూపించలేకపోయాడు. ప్రస్తుతం అతడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







