క్వారంటైన్ నిబంధన తొలగించిన ఖతార్
- September 02, 2022
దోహా: విదేశాల నుంచి ఖతార్కు వచ్చే టూరిస్టులు ఇకపై హోటల్ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వారికి మాత్రం పాత నిబంధనలే అమలు కానున్నాయి. ఈ మేరకు ట్రావెల్ అండ్ రిటర్న్ పాలసీని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MoPH) అప్డేట్ చేసింది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 4 నుంచి అమల్లోకి రానుంది. కొత్త అప్డేట్ ప్రకారం.. ఖతార్లోకి వచ్చే ప్రయాణికులు ముందస్తు, వచ్చిన తర్వాత COVID-19 పరీక్షలు తప్పనిసరి. పౌరులు, నివాసితులు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్పొరేషన్ ఆరోగ్య కేంద్రం లేదా ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించిన ప్రైవేట్ మెడికల్ సెంటర్లో ఖతార్కు చేరుకున్న తర్వాత 24 గంటల వ్యవధిలో రాపిడ్ యాంటిజెన్ పరీక్ష (RAT) చేయించుకోవాలి. అలాగే ఖతార్కు వచ్చేముందు 48 గంటలలోపు చేయించుకున్న పీసీఆర్ (PCR) టెస్ట్ సర్టిఫికేట్ లేదా 24 గంటలలోపు అయితే రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT)ని తీసుకురావాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







