క్వారంటైన్ నిబంధన తొలగించిన ఖతార్
- September 02, 2022
దోహా: విదేశాల నుంచి ఖతార్కు వచ్చే టూరిస్టులు ఇకపై హోటల్ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వారికి మాత్రం పాత నిబంధనలే అమలు కానున్నాయి. ఈ మేరకు ట్రావెల్ అండ్ రిటర్న్ పాలసీని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MoPH) అప్డేట్ చేసింది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 4 నుంచి అమల్లోకి రానుంది. కొత్త అప్డేట్ ప్రకారం.. ఖతార్లోకి వచ్చే ప్రయాణికులు ముందస్తు, వచ్చిన తర్వాత COVID-19 పరీక్షలు తప్పనిసరి. పౌరులు, నివాసితులు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్పొరేషన్ ఆరోగ్య కేంద్రం లేదా ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించిన ప్రైవేట్ మెడికల్ సెంటర్లో ఖతార్కు చేరుకున్న తర్వాత 24 గంటల వ్యవధిలో రాపిడ్ యాంటిజెన్ పరీక్ష (RAT) చేయించుకోవాలి. అలాగే ఖతార్కు వచ్చేముందు 48 గంటలలోపు చేయించుకున్న పీసీఆర్ (PCR) టెస్ట్ సర్టిఫికేట్ లేదా 24 గంటలలోపు అయితే రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT)ని తీసుకురావాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









