క్వారంటైన్ నిబంధన తొలగించిన ఖతార్
- September 02, 2022దోహా: విదేశాల నుంచి ఖతార్కు వచ్చే టూరిస్టులు ఇకపై హోటల్ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వారికి మాత్రం పాత నిబంధనలే అమలు కానున్నాయి. ఈ మేరకు ట్రావెల్ అండ్ రిటర్న్ పాలసీని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MoPH) అప్డేట్ చేసింది. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 4 నుంచి అమల్లోకి రానుంది. కొత్త అప్డేట్ ప్రకారం.. ఖతార్లోకి వచ్చే ప్రయాణికులు ముందస్తు, వచ్చిన తర్వాత COVID-19 పరీక్షలు తప్పనిసరి. పౌరులు, నివాసితులు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్పొరేషన్ ఆరోగ్య కేంద్రం లేదా ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించిన ప్రైవేట్ మెడికల్ సెంటర్లో ఖతార్కు చేరుకున్న తర్వాత 24 గంటల వ్యవధిలో రాపిడ్ యాంటిజెన్ పరీక్ష (RAT) చేయించుకోవాలి. అలాగే ఖతార్కు వచ్చేముందు 48 గంటలలోపు చేయించుకున్న పీసీఆర్ (PCR) టెస్ట్ సర్టిఫికేట్ లేదా 24 గంటలలోపు అయితే రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ (RAT)ని తీసుకురావాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు