ప్రయాణికుల కోసం టిఎస్​ఆర్టీసీ మరో ఆఫర్

- September 03, 2022 , by Maagulf
ప్రయాణికుల కోసం టిఎస్​ఆర్టీసీ మరో ఆఫర్

హైదరాబాద్: టిఎస్​ఆర్టీసీ ప్రయాణికుల కోసం మరో రాయితీని ప్రక‌టించింది. హైద‌రాబాద్ – విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్–బెంగ‌ళూరు వెళ్లే గ‌రుడ‌, రాజ‌ధాని స‌ర్వీసుల ఛార్జీల‌ను ఈ నెలాఖ‌రు వ‌ర‌కు త‌గ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ రెండు మార్గాల్లో నడిచే అంత‌ర్రాష్ట్ర బ‌స్సులు అంటే గరుడ ప్లస్‌, రాజ‌ధాని స‌ర్వీసుల‌లో శుక్రవారం, ఆదివారం మిన‌హా మిగ‌తా అన్ని రోజుల్లో టిక్కెట్టు ఛార్జీలో 10 శాతం రాయితీ క‌ల్పిస్తున్నట్లు వెల్లడించారు.బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చే బస్సులకు శుక్రవారం, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో ఆదివారం తగ్గింపు వర్తించదని స్పష్టం చేసింది. ఈ రాయితీ ఛార్జీలు ఈ నెల 30 వ‌ర‌కు వ‌ర్తించ‌నున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సంస్థ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com