ప్రయాణికుల కోసం టిఎస్ఆర్టీసీ మరో ఆఫర్
- September 03, 2022
హైదరాబాద్: టిఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం మరో రాయితీని ప్రకటించింది. హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్–బెంగళూరు వెళ్లే గరుడ, రాజధాని సర్వీసుల ఛార్జీలను ఈ నెలాఖరు వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ రెండు మార్గాల్లో నడిచే అంతర్రాష్ట్ర బస్సులు అంటే గరుడ ప్లస్, రాజధాని సర్వీసులలో శుక్రవారం, ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో టిక్కెట్టు ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు.బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులకు శుక్రవారం, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో ఆదివారం తగ్గింపు వర్తించదని స్పష్టం చేసింది. ఈ రాయితీ ఛార్జీలు ఈ నెల 30 వరకు వర్తించనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..