భారత్ కరోనా అప్డేట్

- September 03, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7219 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,49,726కు చేరాయి. ఇందులో 4,38,65,016 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 5,27,965 మంది మరణించారు. మరో 56,745 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 9651 మంది కోలుకున్నారు. మరో 25 మంది మహమ్మారికి బలయ్యారు.

మొత్తం కేసుల్లో 0.13 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.68 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.98 శాతంగా ఉందని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 213.01 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com