భారత్ కరోనా అప్డేట్
- September 04, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 6,809 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 8,414 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 55,114 యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతం ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.29 శాతంగా ఉన్నట్లు తెలిపింది. యాక్టివ్ కేసులు 0.12 శాతం ఉన్నట్లు చెప్పింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.69 శాతం ఉన్నట్లు పేర్కొంది.
దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసులు 4,38,73,430గా ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 88.71 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న ఒక్కరోజులో 3,20,820 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 213.20 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు చెప్పింది. వాటిలో రెండో డోసులు 94.33 కోట్లు, మూడవ డోసులు 16.54 కోట్లు ఉన్నట్లు తెలిపింది. నిన్న దేశంలో 19,35,814 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!









