భారత్ కరోనా అప్డేట్
- September 04, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 6,809 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 8,414 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 55,114 యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతం ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.29 శాతంగా ఉన్నట్లు తెలిపింది. యాక్టివ్ కేసులు 0.12 శాతం ఉన్నట్లు చెప్పింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.69 శాతం ఉన్నట్లు పేర్కొంది.
దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసులు 4,38,73,430గా ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 88.71 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న ఒక్కరోజులో 3,20,820 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 213.20 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు చెప్పింది. వాటిలో రెండో డోసులు 94.33 కోట్లు, మూడవ డోసులు 16.54 కోట్లు ఉన్నట్లు తెలిపింది. నిన్న దేశంలో 19,35,814 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు







