ఫింటాస్లో బూజ్ తయారీ ముఠా అరెస్ట్
- September 04, 2022
కువైట్: స్థానికంగా మద్యాన్ని తయారు చేసి దిగుమతి చేసుకున్న బాటిళ్లలో నింపి అమ్ముతున్న ముఠాను అహ్మదీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఫింటాస్లో ఏర్పాటు చేసిన బూజ్ తయారీ కర్మాగారాన్ని పోలీసులు ధ్వంసం చేశారు.ఈ ఘటనకు సంబంధించి నలుగురు ఆసియన్లను పోలీసులు అరెస్టు చేశారు. మేజర్ జనరల్ వాలిద్ అల్-షెహాబ్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. పబ్లిక్ సెక్యూరిటీ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్లా అల్-రజీబ్కు నివేదిక సమర్పించామని, నిందితులను దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. బూజ్ తయారీ కర్మాగారం నుంచి మద్యం, తయారీ సాధనాలు, ప్రింటింగ్ సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







