లాటరీ కొన్న రెండోసారికే ఊహించని విధంగా 20 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు!
- September 04, 2022
అబుధాబి: అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేం.కొందరికి ఊహించని విధంగా రాత్రికి రాత్రి కోట్లు వచ్చిపడుతుంటాయి.ఎంతో మంది ఎన్నో ఏళ్ళుగా లాటరీలో లక్కు కోసం పరితపిస్తూ ఉంటారు.అయితే ఊహించని విధంగా ఓ ఫ్రెంచి వ్యక్తికి రెండోసారే అబుధాబి బిక్ టికెట్ ర్యాఫిల్ లో భారీ జాక్ పాట్ కొట్టాడు.ఒకటికాదు రెండుకాదు ఏకంగా 20 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు.ఇలా అదృష్టం వరించడంతో ఫ్రెంచ్కు చెందిన సెలిన్ జాసిన్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్లో ఉండే సెలిన్ జాసిన్ ఆన్లైన్ ద్వారా ఆగస్టు 13న అబుధాబి బిగ్టికెట్ ర్యాఫిల్ లో నం. 176528 గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.
ఇది అతడు కొనుగోలు చేసిన రెండో టికెటే కావడం గమనార్హం.శనివారం అబుధాబి ఎయిర్పోర్టులో నిర్వహించిన డ్రాలో సెలిన్ జాసిన్ కొన్న ఈ టికెట్కే జాక్పాట్ తగిలింది.దాంతో విజేతగా నిలిచిన అతడు 20 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు.ముందుగా ఈ వార్తా తాను నమ్మలేదని, బిగ్ టికెట్ లాటరీ నిర్వాహకులు తనకు ఫోన్ చేసి చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బై పోయానని ఆనందం వ్యక్తం చేశాడు.కాగా, బిగ్ టికెట్ ర్యాఫిల్ గెలిచి తొలి ఫ్రెంచ్ వ్యక్తి సెలిన్ జాసినే. ఇక ఇదే డ్రాలో భారత్కు చెందిన జయకుమార్ వాసుపిళ్లై అనే వ్యక్తి 1లక్ష దిర్హాములు గెలుచుకున్నాడు.మరో భారత వ్యక్తి అజయ్ భాటియా కూడా కోటి రూపాయలు విలువ చేసే మసెరటి ఘిబ్లీ హైబ్రిడ్ జీటీ అనే కాస్ట్లీ కారు గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!









