లాటరీ కొన్న రెండోసారికే ఊహించని విధంగా 20 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు!
- September 04, 2022
అబుధాబి: అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేం.కొందరికి ఊహించని విధంగా రాత్రికి రాత్రి కోట్లు వచ్చిపడుతుంటాయి.ఎంతో మంది ఎన్నో ఏళ్ళుగా లాటరీలో లక్కు కోసం పరితపిస్తూ ఉంటారు.అయితే ఊహించని విధంగా ఓ ఫ్రెంచి వ్యక్తికి రెండోసారే అబుధాబి బిక్ టికెట్ ర్యాఫిల్ లో భారీ జాక్ పాట్ కొట్టాడు.ఒకటికాదు రెండుకాదు ఏకంగా 20 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు.ఇలా అదృష్టం వరించడంతో ఫ్రెంచ్కు చెందిన సెలిన్ జాసిన్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్లో ఉండే సెలిన్ జాసిన్ ఆన్లైన్ ద్వారా ఆగస్టు 13న అబుధాబి బిగ్టికెట్ ర్యాఫిల్ లో నం. 176528 గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.
ఇది అతడు కొనుగోలు చేసిన రెండో టికెటే కావడం గమనార్హం.శనివారం అబుధాబి ఎయిర్పోర్టులో నిర్వహించిన డ్రాలో సెలిన్ జాసిన్ కొన్న ఈ టికెట్కే జాక్పాట్ తగిలింది.దాంతో విజేతగా నిలిచిన అతడు 20 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు.ముందుగా ఈ వార్తా తాను నమ్మలేదని, బిగ్ టికెట్ లాటరీ నిర్వాహకులు తనకు ఫోన్ చేసి చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బై పోయానని ఆనందం వ్యక్తం చేశాడు.కాగా, బిగ్ టికెట్ ర్యాఫిల్ గెలిచి తొలి ఫ్రెంచ్ వ్యక్తి సెలిన్ జాసినే. ఇక ఇదే డ్రాలో భారత్కు చెందిన జయకుమార్ వాసుపిళ్లై అనే వ్యక్తి 1లక్ష దిర్హాములు గెలుచుకున్నాడు.మరో భారత వ్యక్తి అజయ్ భాటియా కూడా కోటి రూపాయలు విలువ చేసే మసెరటి ఘిబ్లీ హైబ్రిడ్ జీటీ అనే కాస్ట్లీ కారు గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!







