ఎన్నికల తర్వాత కొత్త రెసిడెన్సీ చట్టం. ప్రవాసులకు కష్టాలే
- September 05, 2022
కువైట్ సిటీ: ఎన్నికల తర్వాత కువైట్ లో కొత్త రెసిడెన్సీ చట్టం అమల్లోకి రానుంది.ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే సిద్ధం చేశారు. వలసలు నియంత్రిస్తూ....కువైటీకరణ చేసే విధంగా కొత్త నిబంధనలు రూపొందించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రవాసులకు ఇబ్బందులు తప్పవు. ప్రైవేట్ సెక్టార్ లో వలసలు తగ్గించే విధంగా చట్టంలో కఠినమైన రూల్స్ చేర్చారు. అక్రమ మానవ రవాణాను నిరోధించేందుకు పెద్ద ఎత్తున జరిమానాలు విధించనున్నారు. అక్రమంగా ఎవరైనా వర్కర్స్ ను నియమిస్తే 5,000 కేడీ లను 50,000 కేడీల ను ఫైన్ వేయనున్నారు. అదే విధంగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ లు చేపట్టే సంస్థలు విదేశీ వర్కర్స్ ను నియమించుకుంటే ఒక్కో వర్కర్ పై 500 కేడీల ను డిపాజిట్ చేయటంతో పాటు వారికి హెల్త్ ఇన్సూ రెెన్స్ తప్పనిసరి అని చట్టంలో ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే కువైట్ లో విదేశీ వర్కర్స్ సంఖ్య తగ్గటం ఖాయమని చెబతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







