ఎన్నికల తర్వాత కొత్త రెసిడెన్సీ చట్టం. ప్రవాసులకు కష్టాలే
- September 05, 2022
కువైట్ సిటీ: ఎన్నికల తర్వాత కువైట్ లో కొత్త రెసిడెన్సీ చట్టం అమల్లోకి రానుంది.ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే సిద్ధం చేశారు. వలసలు నియంత్రిస్తూ....కువైటీకరణ చేసే విధంగా కొత్త నిబంధనలు రూపొందించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రవాసులకు ఇబ్బందులు తప్పవు. ప్రైవేట్ సెక్టార్ లో వలసలు తగ్గించే విధంగా చట్టంలో కఠినమైన రూల్స్ చేర్చారు. అక్రమ మానవ రవాణాను నిరోధించేందుకు పెద్ద ఎత్తున జరిమానాలు విధించనున్నారు. అక్రమంగా ఎవరైనా వర్కర్స్ ను నియమిస్తే 5,000 కేడీ లను 50,000 కేడీల ను ఫైన్ వేయనున్నారు. అదే విధంగా గవర్నమెంట్ ప్రాజెక్ట్ లు చేపట్టే సంస్థలు విదేశీ వర్కర్స్ ను నియమించుకుంటే ఒక్కో వర్కర్ పై 500 కేడీల ను డిపాజిట్ చేయటంతో పాటు వారికి హెల్త్ ఇన్సూ రెెన్స్ తప్పనిసరి అని చట్టంలో ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే కువైట్ లో విదేశీ వర్కర్స్ సంఖ్య తగ్గటం ఖాయమని చెబతున్నారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- కువైట్ కాన్సులేట్ పై దాడి.. ఒమన్ ఫైర్..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..









