మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్
- September 06, 2022
న్యూ ఢిల్లీ: పాకిస్థాన్ కు కాల్పుల విరమణ ఒప్పందాని ఉల్లంఘించడం పరిపాటిగా మారింది. జమ్మూకశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు పొడవునా తూటాల మోత మోగించింది. పాక్ రేంజర్లు ఎలాంటి కవ్వింపులు లేకుండానే భారత సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్లపై కాల్పులు జరిపారు.
ఇవాళ ఉదయం జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్ లో పాక్ కాల్పులకు బీఎస్ఎఫ్ దీటుగా జవాబిచ్చిందని బీఎస్ఎఫ్ డిప్యూటీ ఐజీ ఎస్పీఎస్ సంధు వెల్లడించారు. బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ పార్టీని లక్ష్యంగా చేసుకుని పాక్ దళాలు తుపాకీలకు పనిచెప్పాయని వివరించారు. అయితే, భారత్ వైపున ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని బీఎస్ఎఫ్ జమ్మూ ప్రాంత పీఆర్వో వెల్లడించారు.కాగా, గతంలో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ గతేడాది ఫిబ్రవరిలో భారత్, పాక్ ఓ అంగీకారానికి వచ్చాయి.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









