దూర ప్రాంత ప్రయాణీకులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త
- September 08, 2022
అమరావతి: దూర ప్రాంత ప్రయాణీకులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. ఏసీ సర్వీసులకు సంబందించిన చార్జీలను 20 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. అమరావతి, గరుడ ఏసీ సర్వీసుల ఛార్జీలను 20 శాతం తగ్గించగా, ఇంద్ర ఏసీ సర్వీసుకు పది శాతం ఛార్జీల్లో రాయితీ కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తగ్గింపు ధరలతో చూస్తే.. గుంటూరు నుంచి హైదరాబాద్ (ఎమ్జీబీఎస్)కు వెళ్ళే గరుడ ఏసీ సర్వీసు ఛార్జీ రూ. 820లు ఉండగా 20 శాతం తగ్గింపుతో రూ. 670 ఛార్జీ వసూలు చేయనున్నారు.
అలానే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలనున్న గరుడ ఏసీ సర్వీసు ఛార్జీ రూ. 730 ఉండగా 20 శాతం రాయితీతో రూ. 640 వసూలు చేయనున్నారు. ఇక గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళనున్న ఇంద్ర ఏసీ సర్వీసుకు రూ. 660 ఉండగా పది శాతం తగ్గింపుతో రూ. 600లు ఛార్జీ వసూలు చేయనున్నారు. అలాగే గుంటూరు నుంచి బెంగళూరు ఇంద్ర ఏసీ సర్వీసు గతంలో రూ. 1470 కాగా పది శాతం తగ్గింపుతో రూ. 1340 వసూలు చేయనున్నారు. గుంటూరు- తిరుపతి ఇంద్ర ఏసీ సర్వీసుకు కూడా రూ. 890 ఉన్న టిక్కెట్ ఛార్జీ పది శాతం తగ్గింపుతో రూ. 810 వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక తగ్గింపు ధరల నేపథ్యంలో ప్రయాణికుల ఆదరణ పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!
- ఖతార్ లో QR18 బిలియన్లు దాటిన ఆన్లైన్ సేల్స్..!!
- కువైట్ లో ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు









