టీ20 ర్యాంకులను విడుదల చేసిన ఐసీసీ..
- September 08, 2022
ఆసియా కప్ పోటీలు జరుగుతున్న వేళ టీ20 ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. భారత యువ కెరటం సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. 2 నుంచి 4వ ర్యాంకుకు వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 14వ స్థానంలో నిలిచాడు.కోహ్లీ నాలుగు స్థానాలు ఎగబాకి 29 స్థానంలో ఉన్నాడు.
మరోవైపు బ్యాటింగ్ జాబితాలో ఇప్పటివరకు నం.1 స్థానంలో కొనసాగిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ స్థానం గల్లంతైంది. పాకిస్థాన్కే చెందిన మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. దీంతో బాబర్ రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్రమ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ఐదో ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అఫ్గాన్ కెప్టెన్ మహ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్లో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్వుడ్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఏ భారత ఆటగాడు కూడా టాప్-10లో లేడు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







