టీ20 ర్యాంకులను విడుదల చేసిన ఐసీసీ..
- September 08, 2022
ఆసియా కప్ పోటీలు జరుగుతున్న వేళ టీ20 ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. భారత యువ కెరటం సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. 2 నుంచి 4వ ర్యాంకుకు వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 14వ స్థానంలో నిలిచాడు.కోహ్లీ నాలుగు స్థానాలు ఎగబాకి 29 స్థానంలో ఉన్నాడు.
మరోవైపు బ్యాటింగ్ జాబితాలో ఇప్పటివరకు నం.1 స్థానంలో కొనసాగిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ స్థానం గల్లంతైంది. పాకిస్థాన్కే చెందిన మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. దీంతో బాబర్ రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్రమ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ఐదో ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అఫ్గాన్ కెప్టెన్ మహ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్లో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్వుడ్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఏ భారత ఆటగాడు కూడా టాప్-10లో లేడు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







