టీ20 ర్యాంకులను విడుదల చేసిన ఐసీసీ..
- September 08, 2022
ఆసియా కప్ పోటీలు జరుగుతున్న వేళ టీ20 ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. భారత యువ కెరటం సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. 2 నుంచి 4వ ర్యాంకుకు వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 14వ స్థానంలో నిలిచాడు.కోహ్లీ నాలుగు స్థానాలు ఎగబాకి 29 స్థానంలో ఉన్నాడు.
మరోవైపు బ్యాటింగ్ జాబితాలో ఇప్పటివరకు నం.1 స్థానంలో కొనసాగిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ స్థానం గల్లంతైంది. పాకిస్థాన్కే చెందిన మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. దీంతో బాబర్ రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్రమ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ఐదో ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో అఫ్గాన్ కెప్టెన్ మహ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్లో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్వుడ్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఏ భారత ఆటగాడు కూడా టాప్-10లో లేడు.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









