ముంబై, హైదరాబాద్, చెన్నై నుంచి దోహాకు నేరుగా విమానాలు
- September 09, 2022
టాటా గ్రూప్కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తాజాగా ముంబై, హైదరాబాద్, చెన్నై వాసులకు గుడ్ న్యూస్ అందించింది.కొత్త ఫ్లైట్ సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
దోహా, దుబాయ్లో జరగనున్న ఫుట్బాల్ ప్రపంచ కప్ దృష్ట్యా టాటా గ్రూప్ ఎయిర్లైన్ కంపెనీ ఎయిర్ ఇండియా ముంబై, హైదరాబాద్, చెన్నై నుంచి దోహాకు నేరుగా విమానాలను నడుపనున్నట్లు వెల్లడించింది. ప్రతి వారం 20 కొత్త విమానాలు నడుపుతాయని, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల నుంచి దోహాకు ఈ ఫ్లైట్స్ వెళ్తాయని కంపెనీ తెలిపింది. నవంబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఖతార్లో జరగనున్న ఫుట్బాల్ ప్రపంచకప్ కారణంగా డిమాండ్ పెరగొచ్చని, అందుకే దోహాకు నేరుగా విమానాలను నడుపుతున్నట్లు కంపెనీ వివరించింది.ఎయిర్ ఇండియా ప్రకారం.. ఈ కొత్త ఫ్లైట్ సర్వీసులు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 30 నుంచి ముంబై, హైదరాబాద్ , చెన్నై నుండి ఖతార్ రాజధాని దోహాకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ముంబై నుంచి ప్రతి వారం 13 విమానాలు, హైదరాబాద్ నుంచి ప్రతి వారం 4 విమానాలు, చెన్నై నుంచి ప్రతి వారం 3 విమానాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ విమానాలు ఢిల్లీ - దోహా విమానాలకు అదనంగా ఉంటాయి.
కాగా ఎయిర్ ఇండియా గత నెలలో 14 కొత్త విమానాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ - ముంబై, ఢిల్లీ - బెంగళూరు, ముంబై - చెన్నై మార్గాలకు 2 ఫ్రీక్వెన్సీలను జత చేసింది. ఇవి కాకుండా ముంబై - బెంగళూరు మార్గంలో ఫ్రీక్వెన్సీని పెంచారు. ఇప్పుడు మరిన్ని విమానాలు సర్వీసులోకి వస్తున్నాయని, ఆ తర్వాత నెట్వర్క్ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని కంపెనీ పేర్కొంది.
ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఫుట్బాల్ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు భారత్ - ఖతార్ మధ్య బలమైన కనెక్టివిటీని ఎయిర్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారతదేశంలోని ఫుట్బాల్ గేమ్ ప్రేమికులు ఖతార్లోని స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూడటానికి ఇష్టపడతారని, అందుకే మ్యాచ్ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, ఇబ్బంది లేకుండా చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







