ముంబై, హైదరాబాద్, చెన్నై నుంచి దోహాకు నేరుగా విమానాలు
- September 09, 2022
టాటా గ్రూప్కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తాజాగా ముంబై, హైదరాబాద్, చెన్నై వాసులకు గుడ్ న్యూస్ అందించింది.కొత్త ఫ్లైట్ సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
దోహా, దుబాయ్లో జరగనున్న ఫుట్బాల్ ప్రపంచ కప్ దృష్ట్యా టాటా గ్రూప్ ఎయిర్లైన్ కంపెనీ ఎయిర్ ఇండియా ముంబై, హైదరాబాద్, చెన్నై నుంచి దోహాకు నేరుగా విమానాలను నడుపనున్నట్లు వెల్లడించింది. ప్రతి వారం 20 కొత్త విమానాలు నడుపుతాయని, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల నుంచి దోహాకు ఈ ఫ్లైట్స్ వెళ్తాయని కంపెనీ తెలిపింది. నవంబర్ - డిసెంబర్ మధ్య కాలంలో ఖతార్లో జరగనున్న ఫుట్బాల్ ప్రపంచకప్ కారణంగా డిమాండ్ పెరగొచ్చని, అందుకే దోహాకు నేరుగా విమానాలను నడుపుతున్నట్లు కంపెనీ వివరించింది.ఎయిర్ ఇండియా ప్రకారం.. ఈ కొత్త ఫ్లైట్ సర్వీసులు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 30 నుంచి ముంబై, హైదరాబాద్ , చెన్నై నుండి ఖతార్ రాజధాని దోహాకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ముంబై నుంచి ప్రతి వారం 13 విమానాలు, హైదరాబాద్ నుంచి ప్రతి వారం 4 విమానాలు, చెన్నై నుంచి ప్రతి వారం 3 విమానాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ విమానాలు ఢిల్లీ - దోహా విమానాలకు అదనంగా ఉంటాయి.
కాగా ఎయిర్ ఇండియా గత నెలలో 14 కొత్త విమానాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఢిల్లీ - ముంబై, ఢిల్లీ - బెంగళూరు, ముంబై - చెన్నై మార్గాలకు 2 ఫ్రీక్వెన్సీలను జత చేసింది. ఇవి కాకుండా ముంబై - బెంగళూరు మార్గంలో ఫ్రీక్వెన్సీని పెంచారు. ఇప్పుడు మరిన్ని విమానాలు సర్వీసులోకి వస్తున్నాయని, ఆ తర్వాత నెట్వర్క్ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని కంపెనీ పేర్కొంది.
ఎయిర్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపున్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఫుట్బాల్ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు భారత్ - ఖతార్ మధ్య బలమైన కనెక్టివిటీని ఎయిర్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారతదేశంలోని ఫుట్బాల్ గేమ్ ప్రేమికులు ఖతార్లోని స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూడటానికి ఇష్టపడతారని, అందుకే మ్యాచ్ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాన్ని సౌకర్యవంతంగా, ఇబ్బంది లేకుండా చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయంలో అధునాతన ల్యాండింగ్ సదుపాయాలు!
- మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..
- యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం
- ఏపీలో ప్రజల భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ గుప్తా
- కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపడుతున్నాం: హోం మంత్రి అనిత
- బుర్జుమాన్ మాల్ లో టిక్కెట్ లెస్ పార్కింగ్ సిస్టమ్..!!
- యూఏఈలో ప్రాథమిక ఉత్పత్తుల ధరల పెంపుపై మంత్రి క్లారిటీ..!!
- నాన్-ఆల్కహాలిక్ ఏల్ దుబాయ్లో ప్రారంభం..!!
- డ్రగ్స్ వినియోగం..మహిళకు పదేళ్ల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా..!!