త్వరలో ప్రవాసులకు ఆరోగ్య సేవల ఫీ పెంపు..!
- September 10, 2022
కువైట్: ప్రవాసుల కోసం ఆరోగ్య సేవా రుసుములను పెంచే ప్రణాళికను ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో ప్రారంభించనుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణాళికను మూడు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గం వ్యక్తులలో ప్రైవేట్ రంగంలోని కార్మికులు, ఫ్యామిలీ రెసిడెన్సీ పర్మిట్ హోల్డర్లు ఉన్నారు. ఈ వర్గానికి సంవత్సరానికి 130 దినార్ల వరకు ఖర్చయ్యే ఆరోగ్య బీమాను ఉపయోగించి 'డామన్ హాస్పిటల్స్' ద్వారా ఆరోగ్య సేవ అందించబడుతుంది. ఈ రుసుముల్లో రోగుల పరీక్షలు, ఎక్స్-రేలు, చికిత్సలు కవర్ అవుతాయి. రెండవ వర్గంలో ప్రభుత్వ రంగం, ప్రభుత్వ క్లినిక్లు, ఆసుపత్రులలో పని చేస్తున్న ప్రవాసులు ఉన్నారు. వీరు పనిచేసే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా బీమా కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడో కేటగిరీలో టూరిస్టులు ఉన్నారు. కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని రూపొందించారు. గృహ కార్మికులు ప్రస్తుత బీమా ప్యాకేజీ కింద లేదా స్వల్ప పెరుగుదలతో ప్రభుత్వ సౌకర్యాలలో సేవలను పొందవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు
- CBSE అలర్ట్: గల్ఫ్ దేశాల్లో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు కూడా వాయిదా!
- అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!









