తుపాకీతో దోపిడిలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- September 10, 2022
సౌదీ: రియాద్లో బ్యాంకు ఖాతాదారులను తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న ప్రవాసుల ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరెస్టయిన వ్యక్తులు ఇథియోపియన్, సిరియన్, బంగ్లాదేశ్ లకు చెందిన వారని తెలిపింది. ఆఫ్రికా దేశాలకు చెందిన నిందితులు సరిహద్దులను అక్రమంగా దాటి దేశంలోకి చొరబడినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులు తుపాకీలతో బ్యాంక్ ఖాతాదారులను బెదిరించి దోచుకున్నారని మంత్రిత్వ శాఖా పేర్కొంది. ఇథియోపియన్, సిరియన్ దేశాలకు చెందిన నలుగురు వ్యక్తులను.. ఇద్దరు బంగ్లాదేశ్ నివాసితులకు ఆశ్రయం కల్పించి, వారికి సిమ్ కార్డులు అందించిన వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారని మంత్రిత్వ శాఖ తెలిపింది. అరెస్టయిన వ్యక్తుల నుంచి దొంగిలించిన నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతోపాటు నిందితుల నుండి 387 సిమ్ కార్డులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు, పోలీసులు వారిపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్