తుపాకీతో దోపిడిలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- September 10, 2022
సౌదీ: రియాద్లో బ్యాంకు ఖాతాదారులను తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న ప్రవాసుల ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరెస్టయిన వ్యక్తులు ఇథియోపియన్, సిరియన్, బంగ్లాదేశ్ లకు చెందిన వారని తెలిపింది. ఆఫ్రికా దేశాలకు చెందిన నిందితులు సరిహద్దులను అక్రమంగా దాటి దేశంలోకి చొరబడినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులు తుపాకీలతో బ్యాంక్ ఖాతాదారులను బెదిరించి దోచుకున్నారని మంత్రిత్వ శాఖా పేర్కొంది. ఇథియోపియన్, సిరియన్ దేశాలకు చెందిన నలుగురు వ్యక్తులను.. ఇద్దరు బంగ్లాదేశ్ నివాసితులకు ఆశ్రయం కల్పించి, వారికి సిమ్ కార్డులు అందించిన వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారని మంత్రిత్వ శాఖ తెలిపింది. అరెస్టయిన వ్యక్తుల నుంచి దొంగిలించిన నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతోపాటు నిందితుల నుండి 387 సిమ్ కార్డులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు, పోలీసులు వారిపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









