తుపాకీతో దోపిడిలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- September 10, 2022
సౌదీ: రియాద్లో బ్యాంకు ఖాతాదారులను తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న ప్రవాసుల ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అరెస్టయిన వ్యక్తులు ఇథియోపియన్, సిరియన్, బంగ్లాదేశ్ లకు చెందిన వారని తెలిపింది. ఆఫ్రికా దేశాలకు చెందిన నిందితులు సరిహద్దులను అక్రమంగా దాటి దేశంలోకి చొరబడినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులు తుపాకీలతో బ్యాంక్ ఖాతాదారులను బెదిరించి దోచుకున్నారని మంత్రిత్వ శాఖా పేర్కొంది. ఇథియోపియన్, సిరియన్ దేశాలకు చెందిన నలుగురు వ్యక్తులను.. ఇద్దరు బంగ్లాదేశ్ నివాసితులకు ఆశ్రయం కల్పించి, వారికి సిమ్ కార్డులు అందించిన వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారని మంత్రిత్వ శాఖ తెలిపింది. అరెస్టయిన వ్యక్తుల నుంచి దొంగిలించిన నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతోపాటు నిందితుల నుండి 387 సిమ్ కార్డులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు, పోలీసులు వారిపై ప్రాథమిక చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







