కార్మికుల బహిష్కరణ వార్తలను ఖండించిన యూఏఈ
- September 10, 2022
యూఏఈ: ఆఫ్రికన్ దేశాలకు చెందిన కొంతమంది కార్మికులను బహిష్కరించడంపై మీడియా రిపోర్టింగ్లకు సంబంధించిన ఆరోపణలు అవాస్తవమని యూఏఈ విదేశాంగ, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖలోని మానవ హక్కుల విభాగం డైరెక్టర్ సయీద్ అల్ హెబ్సీ ఖండించారు. మీడియాలో చూపుతున్న నివేదికలు పాతవని పేర్కొన్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫర్ హ్యూమన్ రైట్స్ పాలసీస్ ప్రచురించిన నివేదికను మీడియాలో తప్పుగా చూపుతున్నారన్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గతంలో 2021లో ప్రచురించిన నివేదికలను మీడియాలో చూపుతున్నారని అల్ హెబ్సీ అన్నారు. వివిధ ఉల్లంఘనల్లో అరెస్టయిన కార్మికులపై చట్టపరమైన విధానాలలో దేశ బహిష్కరణ జరిగిందని, ఇదంతా సాధారణ ప్రక్రియలో భాగమని అల్ హెబ్సీ పేర్కొన్నారు. కార్మిక విధానాల్లో యూఏఈ పూర్తి పారదర్శకతకు కట్టుబడి ఉందని, ఈ విషయంలో సంబంధిత అధికారుల అధికారిక ప్రకటనలను ప్రస్తావించాలని మీడియాను అల్ హెబ్సీ కోరారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







