ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన ఏపీ డిజిపి
- September 10, 2022
విజయవాడ: ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్,సైకియాట్రిక్ సొసైటి ఆద్వర్యంలో బెంజిసర్కిల్ నుండి ఇందిరా గాంధి స్టేడియం వరుకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన ఏపీ డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి.
కుటుంబ కలహాలతోనే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ.రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు.జాతీయ నేర గణాంక సంస్థ ప్రకటించిన 2021 గణాంకాల్లో ఇదే విషయమై స్పష్టమైందన్నారు.పోలీసు శాఖ, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినం పురస్కరించుకొని నిర్వహించిన ప్రదర్శనలో డీజీపీ పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా బెంజిసర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు విద్యార్థులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. చదువుల విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై ఒత్తిడి తీసుకురావొద్దని డీజీపీ సూచించారు.ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు... అనారోగ్య సమస్యలతో మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా, అధికారులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, మానసిక చికిత్స వైద్య నిపుణులు ప్రదర్శనలో పాల్గొన్నారు.



తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









