సైనిక స్టేషన్తో పాటు రహదారికి దివంగత బిపిన్ రావత్ పేరు..!
- September 10, 2022
ఈటానగర్: ఇండియన్ ఆర్మీ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, దిగవంత జనరల్ బిపిన్ రావత్ స్మారకార్థం అరుణాచల్ప్రదేశ్లోని కిబితులోని సైనిక స్టేషన్తో పాటు రహదారికి ఆయన పేరును పెట్టారు. చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ (LAC)లోని లోహిత్ వ్యాలీలో ఉన్న ఈ సైనిక స్టేషన్ను ఇకపై జనరల్ బిపిన్ రావత్ స్టేషన్గా పిలువనున్నారు. అలాగే గ్రామ ప్రధాన రహదారికి సైతం ఆయన పేరును పెట్టారు. గతేడాది డిసెంబర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
కాగా, కల్నల్గా రావత్ 1999 నుంచి 2000 వరకు కితిబులోని బెలాలియన్ 5/11 గూర్ఖా రైఫిల్స్కు నాయకత్వం వహించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో కిబితు గ్రామ ప్రధాన రహదారికి అరుణాచల్ప్రదేశ్ గవర్నర్ బీడీ మిశ్రా, ముఖ్యమంత్రి పెమా ఖండూ, తూర్పు ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రాణా ప్రతాప్ కలిత పేరు పెట్టారు. రావత్ కుమార్తెలు కృతిక, తారిణితో పాటు పలువురు సీనియర్ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే కిబితు మిలిటరీ క్యాంప్ పేరు జనరల్ బిపిన్ రావత్ మిలిటరీ గారిసన్గా మార్చారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









