కువైట్ లో త్వరలోనే భారీగా ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లు
- September 10, 2022
కువైట్: కువైట్ లో త్వరలోనే భారీగా ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రభుత్వం సిద్ధం చేసిందని రెన్యువబుల్ ఎనర్జీ మినిస్టర్ అల్ మౌసా తెలిపారు. కువైట్ వాతావారణ పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడెక్కడ ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న రోడ్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.గత కొంతకాలంగా దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉందని ఆయన చెప్పారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ కార్ల రంగానికి మద్దతుగా నిలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వ బిల్డింగ్ లు, కమర్షియల్ ఏరియాల్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలు దేశంలో తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ లను నెలకొల్పే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అల్ మౌసా చెప్పారు.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









