ఫ్లోర్ మిల్స్ ద్వారా బడి పిల్లలకు భోజనం-కువైట్ విద్యాశాఖ
- September 10, 2022
కువైట్: కువైట్ లో బడి పిల్లలకు భోజనం అందించే ప్రాజెక్ట్ ను మళ్లీ ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నారు. కువైట్ లో 6 ఏళ్ల లోపు బడి పిల్లలకు ప్రభుత్వమే పౌష్టికాహారం, భోజనం అందిస్తుంది. ఐతే కరోనా కారణంగా రెండేళ్ల పాటు పిల్లలకు భోజనం అందించటాన్ని నిలిపివేశారు. ఈ ఏడాది మళ్లీ పిల్లలకు భోజనం అందించే ప్రాజెక్ట్ ను పునరుద్ధరిస్తున్నట్లు కువైట్ విద్యాశాఖ తెలిపింది. కువైట్ లోని పిండి మిల్లులలో పిల్లలకు తాత్కాలికంగా భోజనం సిద్ధం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఫ్లోర్ మిల్స్ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. కొన్ని నెలల పాటు ఫ్లోర్ మిల్స్ లలో పిల్లల కోసం భోజనం సిద్ధం చేయించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పరిస్థితులన్నీ పూర్తిగా చక్కబడిన తర్వాత పిల్లల కోసం భోజనం సిద్ధం చేసేందుకు స్వంతంగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!









