ఫ్లోర్ మిల్స్ ద్వారా బడి పిల్లలకు భోజనం-కువైట్ విద్యాశాఖ
- September 10, 2022
కువైట్: కువైట్ లో బడి పిల్లలకు భోజనం అందించే ప్రాజెక్ట్ ను మళ్లీ ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నారు. కువైట్ లో 6 ఏళ్ల లోపు బడి పిల్లలకు ప్రభుత్వమే పౌష్టికాహారం, భోజనం అందిస్తుంది. ఐతే కరోనా కారణంగా రెండేళ్ల పాటు పిల్లలకు భోజనం అందించటాన్ని నిలిపివేశారు. ఈ ఏడాది మళ్లీ పిల్లలకు భోజనం అందించే ప్రాజెక్ట్ ను పునరుద్ధరిస్తున్నట్లు కువైట్ విద్యాశాఖ తెలిపింది. కువైట్ లోని పిండి మిల్లులలో పిల్లలకు తాత్కాలికంగా భోజనం సిద్ధం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఫ్లోర్ మిల్స్ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. కొన్ని నెలల పాటు ఫ్లోర్ మిల్స్ లలో పిల్లల కోసం భోజనం సిద్ధం చేయించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పరిస్థితులన్నీ పూర్తిగా చక్కబడిన తర్వాత పిల్లల కోసం భోజనం సిద్ధం చేసేందుకు స్వంతంగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







