కేసీఆర్ కు అస్వస్థత...
- April 17, 2016
తెలంగాణ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. అత్యవసరంగా ఆయనకు వైద్యులు సేవలు అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన స్వల్పంగా జర్వంతో బాధపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం విశ్రాంతి అత్యవసరమని వైద్యలు చెప్పారట. ప్రస్తుతం ఆయన మెదక్ జిల్లాలోని తన ఫామ్ హౌజ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.జ్వరం కారణంగా కేసీఆర్ అధికారి కార్యక్రమాలన్నీ తాత్కాలికంగా రద్దయ్యాయి. కనీసం మూడు రోజుల వరకూ సీఎం సాధారణ కార్యక్రమాలకు హాజరుకాలేకపోవచ్చని తెలుస్తోంది. ఫామ్ హౌజ్ నుంచి మూడు రోజులపాటు కేసీఆర్ బయటకు రాకపోవచ్చు. సీఎం అస్వస్థత వార్త విని టీఆర్ఎస్ శ్రేణులు కాస్త కంగారు పడినా.. స్వల్ప జర్వమేనని తెలుసుకుని ఊరట చెందాయి.ఓవైపు తెలంగాణలో ఎండలు మండిపోతున్న వేళ.. కేసీఆర్ అస్వస్థత వార్త అందరినీ కలవరపరిచింది. తెలంగాణ వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. శనివారం గరిష్టంగా నిజామాబాద్ లో గరిష్టం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాయువ్య భారత్ నుంచి ఉష్ణగాలులు వీస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 5 వరకు బయటకు వెళ్లడం ప్రమాదకరణని వైద్యులు చెబుతున్నారు. రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. తెలంగాణ అంతటా 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే దాదాపు 17 మంది వరకూ వడగాల్పులతో మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







