అక్రమంగా వీసా వ్యాపారం చేస్తున్న ఫేక్ కంపెనీలపై దాడులు
- September 13, 2022
కువైట్: అక్రమంగా వీసాలు అమ్మే వ్యాపారం చేస్తున్న కంపెనీలపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ డిపార్ట్ మెంట్ నజర్ పెట్టింది.
ఈ అక్రమ వ్యాపారం చేస్తున్న వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రైపాక్షిక కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం జయిబ్ అల్-షూయోక్ కమర్షియల్ కాంప్లెక్స్ లో దాడులు నిర్వహించింది. ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా వీసా లు అమ్మే వ్యాపారం చేస్తున్న కంపెనీలను గుర్తించింది. దాదాపు 80 సంస్థలు ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు సోదాలు తెలిసింది. ఆయా కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని ట్రేడ్ మినిస్ట్రీ తో పంచుకోనుంది. ఒకవేళ అదే అడ్రస్ తో కమర్షియల్ బిజినెస్ లైసెన్స్ లేనట్లైతే వారి లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. స్థానికంగా చాలా మంది వ్యాపారులు ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం అందటంతో ఈ దాడులు చేశారు. అదే విధంగా అక్రమంగా వ్యాపారం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయన్న దానిపై వారికి అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







