అక్రమంగా వీసా వ్యాపారం చేస్తున్న ఫేక్ కంపెనీలపై దాడులు
- September 13, 2022
కువైట్: అక్రమంగా వీసాలు అమ్మే వ్యాపారం చేస్తున్న కంపెనీలపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ డిపార్ట్ మెంట్ నజర్ పెట్టింది.
ఈ అక్రమ వ్యాపారం చేస్తున్న వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రైపాక్షిక కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం జయిబ్ అల్-షూయోక్ కమర్షియల్ కాంప్లెక్స్ లో దాడులు నిర్వహించింది. ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా వీసా లు అమ్మే వ్యాపారం చేస్తున్న కంపెనీలను గుర్తించింది. దాదాపు 80 సంస్థలు ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు సోదాలు తెలిసింది. ఆయా కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని ట్రేడ్ మినిస్ట్రీ తో పంచుకోనుంది. ఒకవేళ అదే అడ్రస్ తో కమర్షియల్ బిజినెస్ లైసెన్స్ లేనట్లైతే వారి లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. స్థానికంగా చాలా మంది వ్యాపారులు ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం అందటంతో ఈ దాడులు చేశారు. అదే విధంగా అక్రమంగా వ్యాపారం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయన్న దానిపై వారికి అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష