అక్రమంగా వీసా వ్యాపారం చేస్తున్న ఫేక్ కంపెనీలపై దాడులు
- September 13, 2022
కువైట్: అక్రమంగా వీసాలు అమ్మే వ్యాపారం చేస్తున్న కంపెనీలపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ డిపార్ట్ మెంట్ నజర్ పెట్టింది.
ఈ అక్రమ వ్యాపారం చేస్తున్న వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రైపాక్షిక కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం జయిబ్ అల్-షూయోక్ కమర్షియల్ కాంప్లెక్స్ లో దాడులు నిర్వహించింది. ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా వీసా లు అమ్మే వ్యాపారం చేస్తున్న కంపెనీలను గుర్తించింది. దాదాపు 80 సంస్థలు ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు సోదాలు తెలిసింది. ఆయా కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని ట్రేడ్ మినిస్ట్రీ తో పంచుకోనుంది. ఒకవేళ అదే అడ్రస్ తో కమర్షియల్ బిజినెస్ లైసెన్స్ లేనట్లైతే వారి లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. స్థానికంగా చాలా మంది వ్యాపారులు ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం అందటంతో ఈ దాడులు చేశారు. అదే విధంగా అక్రమంగా వ్యాపారం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయన్న దానిపై వారికి అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







