అక్రమంగా వీసా వ్యాపారం చేస్తున్న ఫేక్ కంపెనీలపై దాడులు
- September 13, 2022
కువైట్: అక్రమంగా వీసాలు అమ్మే వ్యాపారం చేస్తున్న కంపెనీలపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ డిపార్ట్ మెంట్ నజర్ పెట్టింది.
ఈ అక్రమ వ్యాపారం చేస్తున్న వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రైపాక్షిక కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం జయిబ్ అల్-షూయోక్ కమర్షియల్ కాంప్లెక్స్ లో దాడులు నిర్వహించింది. ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా వీసా లు అమ్మే వ్యాపారం చేస్తున్న కంపెనీలను గుర్తించింది. దాదాపు 80 సంస్థలు ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నట్లు సోదాలు తెలిసింది. ఆయా కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని ట్రేడ్ మినిస్ట్రీ తో పంచుకోనుంది. ఒకవేళ అదే అడ్రస్ తో కమర్షియల్ బిజినెస్ లైసెన్స్ లేనట్లైతే వారి లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. స్థానికంగా చాలా మంది వ్యాపారులు ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం అందటంతో ఈ దాడులు చేశారు. అదే విధంగా అక్రమంగా వ్యాపారం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయన్న దానిపై వారికి అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









