ప్రపంచంలోనే అతిపెద్ద చరఖాని దిల్లీలో..
- April 17, 2016
ప్రపంచంలోనే అతిపెద్ద చరఖాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటుచేయనున్నారు. ఎయిర్పోర్టులోని మూడో టర్మినల్ వద్ద ఈ చరఖాను పెట్టనున్నారు. భారత అహింసా విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు దీన్ని ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ చరఖా తయారీ పనులు పూర్తవగా.. త్వరలోనే దీన్ని ఎయిర్పోర్టుకు తీసుకురానున్నారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో గల ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) యూనిట్లో ఈ చరఖాను రూపొందించారు. నాలుగు టన్నుల బరువున్న ఈ చరఖాను పూర్తిగా టేకుతో తయారుచేశారు. 26 మంది వర్కర్లు, కార్పెంటర్లు కలిసి 40 రోజుల్లో దీన్ని పూర్తిచేసినట్లు కేవీఐసీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







