శర్వానంద్ 25వ చిత్రాన్ని వైవిధ్యభరితం
- April 17, 2016
వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ ఇటీవల ఎక్స్ప్రెస్ రాజా అనే చిత్రంతో భారీ విజయాన్ని సాధించాడు. ఈ మూవీ శర్వానంద్కు 24వ చిత్రం. ఇక తాజాగా తన 25వ చిత్రాన్ని వైవిధ్యభరితమైన కథతో అత్యద్భుతంగా రూపొందించాలని భావిస్తున్నాడు. ఈ నేపధ్యంలో భారీ చిత్రాల నిర్మాత బివీఎస్ఎన్ ప్రసాద్తో కలిసి తన 25వ చిత్రాన్ని చేసేందుకు సిద్ధమయ్యాడు ఈ యంగ్ హీరో. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.రన్ రాజా రన్, మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో వరుస సక్సెస్ లు సాధించిన శర్వానంద్ తన తర్వాతి చిత్రాన్ని కొత్త దర్శకుడితో చేయాలనుకుంటున్నాడట. అయితే ఎన్టీఆర్ 25వ చిత్రం నాన్నకు ప్రేమతోకు నిర్మాతగా వ్యవహరించిన బివీఎస్ఎన్ ప్రసాద్ శర్వానంద్ 25వ చిత్రం నిర్మించడం విశేషం.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







