శర్వానంద్ 25వ చిత్రాన్ని వైవిధ్యభరితం

- April 17, 2016 , by Maagulf
శర్వానంద్ 25వ చిత్రాన్ని వైవిధ్యభరితం

వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ ఇటీవల ఎక్స్‌ప్రెస్ రాజా అనే చిత్రంతో భారీ విజయాన్ని సాధించాడు. ఈ మూవీ శర్వానంద్‌కు 24వ చిత్రం. ఇక తాజాగా తన 25వ చిత్రాన్ని వైవిధ్యభరితమైన కథతో అత్యద్భుతంగా రూపొందించాలని భావిస్తున్నాడు. ఈ నేపధ్యంలో భారీ చిత్రాల నిర్మాత బివీఎస్‌ఎన్ ప్రసాద్‌తో కలిసి తన 25వ చిత్రాన్ని చేసేందుకు సిద్ధమయ్యాడు ఈ యంగ్ హీరో. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.రన్ రాజా రన్, మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో వరుస సక్సెస్ లు సాధించిన శర్వానంద్ తన తర్వాతి చిత్రాన్ని కొత్త దర్శకుడితో చేయాలనుకుంటున్నాడట. అయితే ఎన్టీఆర్ 25వ చిత్రం నాన్నకు ప్రేమతోకు నిర్మాతగా వ్యవహరించిన బివీఎస్‌ఎన్ ప్రసాద్ శర్వానంద్ 25వ చిత్రం నిర్మించడం విశేషం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com