ప్రపంచంలోనే అతిపెద్ద చరఖాని దిల్లీలో..
- April 17, 2016ప్రపంచంలోనే అతిపెద్ద చరఖాని దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటుచేయనున్నారు. ఎయిర్పోర్టులోని మూడో టర్మినల్ వద్ద ఈ చరఖాను పెట్టనున్నారు. భారత అహింసా విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు దీన్ని ఏర్పాటుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ చరఖా తయారీ పనులు పూర్తవగా.. త్వరలోనే దీన్ని ఎయిర్పోర్టుకు తీసుకురానున్నారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో గల ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) యూనిట్లో ఈ చరఖాను రూపొందించారు. నాలుగు టన్నుల బరువున్న ఈ చరఖాను పూర్తిగా టేకుతో తయారుచేశారు. 26 మంది వర్కర్లు, కార్పెంటర్లు కలిసి 40 రోజుల్లో దీన్ని పూర్తిచేసినట్లు కేవీఐసీ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..