భారత రాయబారి హెచ్‌ఈ సిబీ జార్జ్ బదిలీ

- September 14, 2022 , by Maagulf
భారత రాయబారి హెచ్‌ఈ సిబీ జార్జ్ బదిలీ

కువైట్: భారత రాయబారి హెచ్‌ఈ సిబీ జార్జ్ బదిలీ అయ్యారు. జపాన్‌లో భారత తదుపరి రాయబారిగా సిబీ జార్జ్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సిబి జార్జ్ 2020 ఆగస్టులో కువైట్‌లో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. రాయబారి జార్జ్ చేపట్టిన అనేక కార్యక్రమాల ద్వారా భారతీయ ప్రవాసులలో చాలా ప్రజాదరణ పొందారు. కోవిడ్‌ సమయంలో తన పనితీరుతో అందరిని ఆకట్టుకున్నారు. తన పదవి కాలంలో భారత్- కువైట్ సంబంధాలను మరింత మెరుగుపరచగలిగాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com