ప్రపంచంలోనే తొలిసారిగా.. యూఏఈలో పేపర్లెస్ ట్యాక్స్ రీఫండ్ స్కీమ్
- September 14, 2022
యూఏఈ: పర్యాటకుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి పేపర్లెస్ ట్యాక్స్ రీఫండ్ స్కీమ్ను యూఏఈ ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) ప్రకటించింది. కొత్త స్కీమ్ లో భాగంగా టూరిస్టులు తమ కొనుగోళ్లకు సంబంధించిన పేపర్ బిల్స్ ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) డైరెక్టర్ జనరల్ ఖలీద్ అలీ అల్ బుస్తానీ తెలిపారు. అన్ని దుకాణందారుల వివరాలను ఆన్ లైన్ చేయడంతోపాటు కొనుగోళ్లకు సంబంధించిన బిల్స్ ఎలక్ట్రానిక్గా రూపొందించబడతాయని, VAT రీఫండ్ క్లెయిమ్ చేయడం ఇక టూరిస్టులకు సులువవుతుందని ఆయన వివరించారు. FTA ప్లానెట్ టాక్స్ సీనియర్ అధికారులు హాజరైన సమావేశంలో అల్ బుస్తానీ మాట్లాడారు. 2018లో ఐదు శాతం విలువ ఆధారిత పన్ను (VAT)ని యూఏఈ ప్రవేశపెట్టింది. దేశంలోని పర్యాటకులు దేశం విడిచి వెళ్లినప్పుడు అవుట్లెట్లలో చేసిన కొనుగోళ్లపై VAT రీఫండ్ క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్లానెట్ టాక్స్ దేశంలో వ్యాట్ రీఫండ్ల కోసం దాదాపు 100 కియోస్క్లను కూడా నిర్వహిస్తోంది. ఈ పేపర్లెస్ ట్యాక్స్ రీఫండ్ స్కీమ్ అమలుతో పేపర్ కోసం వినియోగించే 16,000 చెట్లను రక్షించినట్లు అవుతుందని అల్ వుస్తానీ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







