ప్రపంచంలోనే తొలిసారిగా.. యూఏఈలో పేపర్లెస్ ట్యాక్స్ రీఫండ్ స్కీమ్
- September 14, 2022
యూఏఈ: పర్యాటకుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి పేపర్లెస్ ట్యాక్స్ రీఫండ్ స్కీమ్ను యూఏఈ ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) ప్రకటించింది. కొత్త స్కీమ్ లో భాగంగా టూరిస్టులు తమ కొనుగోళ్లకు సంబంధించిన పేపర్ బిల్స్ ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) డైరెక్టర్ జనరల్ ఖలీద్ అలీ అల్ బుస్తానీ తెలిపారు. అన్ని దుకాణందారుల వివరాలను ఆన్ లైన్ చేయడంతోపాటు కొనుగోళ్లకు సంబంధించిన బిల్స్ ఎలక్ట్రానిక్గా రూపొందించబడతాయని, VAT రీఫండ్ క్లెయిమ్ చేయడం ఇక టూరిస్టులకు సులువవుతుందని ఆయన వివరించారు. FTA ప్లానెట్ టాక్స్ సీనియర్ అధికారులు హాజరైన సమావేశంలో అల్ బుస్తానీ మాట్లాడారు. 2018లో ఐదు శాతం విలువ ఆధారిత పన్ను (VAT)ని యూఏఈ ప్రవేశపెట్టింది. దేశంలోని పర్యాటకులు దేశం విడిచి వెళ్లినప్పుడు అవుట్లెట్లలో చేసిన కొనుగోళ్లపై VAT రీఫండ్ క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్లానెట్ టాక్స్ దేశంలో వ్యాట్ రీఫండ్ల కోసం దాదాపు 100 కియోస్క్లను కూడా నిర్వహిస్తోంది. ఈ పేపర్లెస్ ట్యాక్స్ రీఫండ్ స్కీమ్ అమలుతో పేపర్ కోసం వినియోగించే 16,000 చెట్లను రక్షించినట్లు అవుతుందని అల్ వుస్తానీ అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









