ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెరిగిన కువైట్ కార్మికులు
- September 14, 2022
కువైట్ సిటీ: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో కువైట్ కార్మికుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) తెలిపింది. పీఏసీఐ లెక్కల ప్రకారం.. 2021 జనవరి నుండి 2022 మధ్య వరకు 18,558 కువైటీలు ప్రభుత్వ రంగంలో చేరారు. దీంతో ప్రభుత్వ రంగంలోని మొత్తం కువైట్ ఉద్యోగుల సంఖ్య 2020 చివరినాటికి 354,384 ఉండగా.. 2022 జూన్ చివరి నాటికి 372,942కి పెరిగింది. అదే కాలంలో ప్రైవేట్ రంగంలో సుమారు 12,681 మంది కువైటీలు కొత్తగా ఉద్యోగంలో చేరారు. 2020 చివరి నాటికి 63,240 ఉన్న ఉద్యోగుల సంఖ్య 2022 మధ్య నాటికి 75,921కి చేరుకుందని పీఏసీఐ తెలిపింది. నాన్-కువైట్ కార్మికులకు సంబంధించి.. 2021 ప్రారంభం నుండి 2022 మధ్య కాలంలో దాదాపు 185,360 మంది నాన్-కువైట్లు ప్రైవేట్ రంగాన్ని విడిచిపెట్టారు. 2022 జూన్ చివరి నాటికి ప్రైవేట్ రంగంలో మొత్తం నాన్-కువైట్ ఉద్యోగుల సంఖ్య 1,355,935కి తగ్గిందని పీఏసీఐ లెక్కలు చెబుతున్నాయి. జనాభా లెక్కల ప్రకారం.. 2019 చివరి నాటికి దాదాపు ఒక మిలియన్ 656 వేల 983 మంది కార్మికులు ఉండగా.. 2020 డిసెంబర్ నాటికి ఆ సంఖ్య ఒక మిలియన్ 541 వేల 295 కు తగ్గింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







