ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెరిగిన కువైట్ కార్మికులు
- September 14, 2022
కువైట్ సిటీ: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో కువైట్ కార్మికుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) తెలిపింది. పీఏసీఐ లెక్కల ప్రకారం.. 2021 జనవరి నుండి 2022 మధ్య వరకు 18,558 కువైటీలు ప్రభుత్వ రంగంలో చేరారు. దీంతో ప్రభుత్వ రంగంలోని మొత్తం కువైట్ ఉద్యోగుల సంఖ్య 2020 చివరినాటికి 354,384 ఉండగా.. 2022 జూన్ చివరి నాటికి 372,942కి పెరిగింది. అదే కాలంలో ప్రైవేట్ రంగంలో సుమారు 12,681 మంది కువైటీలు కొత్తగా ఉద్యోగంలో చేరారు. 2020 చివరి నాటికి 63,240 ఉన్న ఉద్యోగుల సంఖ్య 2022 మధ్య నాటికి 75,921కి చేరుకుందని పీఏసీఐ తెలిపింది. నాన్-కువైట్ కార్మికులకు సంబంధించి.. 2021 ప్రారంభం నుండి 2022 మధ్య కాలంలో దాదాపు 185,360 మంది నాన్-కువైట్లు ప్రైవేట్ రంగాన్ని విడిచిపెట్టారు. 2022 జూన్ చివరి నాటికి ప్రైవేట్ రంగంలో మొత్తం నాన్-కువైట్ ఉద్యోగుల సంఖ్య 1,355,935కి తగ్గిందని పీఏసీఐ లెక్కలు చెబుతున్నాయి. జనాభా లెక్కల ప్రకారం.. 2019 చివరి నాటికి దాదాపు ఒక మిలియన్ 656 వేల 983 మంది కార్మికులు ఉండగా.. 2020 డిసెంబర్ నాటికి ఆ సంఖ్య ఒక మిలియన్ 541 వేల 295 కు తగ్గింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







