బ్యాంకింగ్ మోసాలపట్ల జాగ్రత్త: మంత్రిత్వశాఖ

- September 15, 2022 , by Maagulf
బ్యాంకింగ్ మోసాలపట్ల జాగ్రత్త: మంత్రిత్వశాఖ

కువైట్ సిటీ: బ్యాంకింగ్ మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలని కువైటీలు, ప్రవాసులను అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. సున్నితమైన పర్సనల్ బ్యాంకింగ్ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించింది. బ్యాంకింగ్  డేటాను అప్డేట్ చేసుకోవాలంటూ వచ్చే మెసేజ్ ల పట్ల స్పందించవద్దని అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది. అనేక మార్గాల్లో బ్యాంకింగ్ మోసగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని, బ్యాంకింగ్ డేటాను అభ్యర్థించే స్కామర్లు పంపే మోసపూరిత ప్రచారాలపై స్పందించవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాంటి ప్రకటనలను వెంటనే సబంధిత అధికారులకు తెలపాలని అంతర్గత మంత్రిత్వ శాఖ కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com