రసాయనాలతో కరెన్సీ నోట్ల పేరిట మోసం.. ముగ్గురు ఆఫ్రికన్స్ అరెస్ట్
- September 15, 2022
బహ్రెయిన్: రసాయన పదార్ధాలను ఉపయోగించి సాధారణ కాగితాన్ని కరెన్సీ నోట్లుగా మార్చవచ్చని నమ్మించి మోసం చేస్తున్న ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్టు చేసినట్లు యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ ప్రకటించింది. నిందితుల నివాసం నుంచి రసాయనాలు, పరికరాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి మోసగాళ్ల బారిన పడొద్దని.. పౌరులు, నివాసితులు అప్రమత్తంగా ఉండాలని జనరల్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. ఇలాంటి మోసగాళ్ల గురించిన సమాచారం తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







