రసాయనాలతో కరెన్సీ నోట్ల పేరిట మోసం.. ముగ్గురు ఆఫ్రికన్స్ అరెస్ట్

- September 15, 2022 , by Maagulf
రసాయనాలతో కరెన్సీ నోట్ల పేరిట మోసం.. ముగ్గురు ఆఫ్రికన్స్ అరెస్ట్

బహ్రెయిన్‌: రసాయన పదార్ధాలను ఉపయోగించి సాధారణ కాగితాన్ని కరెన్సీ నోట్లుగా మార్చవచ్చని నమ్మించి మోసం చేస్తున్న ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్టు చేసినట్లు యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ ప్రకటించింది. నిందితుల నివాసం నుంచి రసాయనాలు, పరికరాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి మోసగాళ్ల బారిన పడొద్దని.. పౌరులు, నివాసితులు అప్రమత్తంగా ఉండాలని జనరల్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. ఇలాంటి మోసగాళ్ల గురించిన సమాచారం తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com