‘శాకినీ ఢాకినీ’ సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది.!
- September 15, 2022
రెజీనా కసండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్లో తెరకెక్కుతోన్న మూవీ ‘శాకినీ ఢాకినీ’. కొరియన్ మూవీకి రీమేక్గా రూపొందింది ఈ సినిమా. ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకుడు. కాగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ కాన్సెప్ట్ని చొప్పించారట.
రీమేక్ మూవీనే అయినా ఆ కాన్సెప్టు ఈ సినిమాకి చక్కగా సూట్ అయ్యిందనీ అంటున్నారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో ఈ సినిమాని కమర్షియల్ అంశాలు జోడించి రూపొందించారు. రీమేక్ మూవీనే అయినా, కాన్సెప్ట్ మాత్రమే తీసుకున్నారట. పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా సినిమాని రూపొందించారట.
రీసెంట్గా జరిగిన ఓ నేరానికి సంబంధించిన అంశాన్ని ఈ సినిమాలో ప్రస్థావించారట. అదే సినిమాకి కీలకం అని చెబుతున్నారు. ఆ నేరాన్ని పరిష్కరించే ట్రైనీ పోలీసులుగా నివేదా, రెజీనా నటిస్తున్నారు. ఓ మహిళ సమస్యను మరో మహిళే చెబితేనే అర్ధమవ్వాల్సిన విధంగా అర్ధమవుతుందనీ, అందుకే ఈ సినిమాని పూర్తిగా మహిళల కోణంలో తీశామనీ చిత్ర నిర్మాత తాటి సునీత చెబుతున్నారు.
సీరియస్ కాన్సెప్ట్ అయినా, కాస్త కామెడీ టోన్లో చెప్పామనీ, అలాగే, సెంటిమెంటల్గా ఈ సినిమా అందరికీ బాగా కనెక్ట్ అవుతుందనీ ఆమె పేర్కొన్నారు. ఇంతవరకూ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయ్. శుక్రవారం ‘శాకినీ ఢాకినీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- అహ్మదీ గవర్నరేట్లో 8 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్టు..!!
- యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!









