ఓ చిన్నారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ..
- April 17, 2016
కాన్పూర్: నిండా పదేళ్లు కూడా నిండని ఓ చిన్నారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. అది కూడా ఏవైనా సమస్యల గురించా అంటే కానే కాదట. ప్రధాని మోదీ పాలనను మెచ్చుకుంటూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ చిన్నారి లేఖ రాసింది.కాన్పూర్కు చెందిన అదితి అనే చిన్నారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. ప్రభుత్వ పథకాలు, పాలనపై ఈ లేఖలో ప్రశంసల జల్లు కురిపించింది. దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రారంభిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈ చిన్నారి ఉత్తరానికి ప్రత్యుత్తరం కూడా వచ్చిందట. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి ఈ విషయాన్ని తెలిపింది. తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి థాంక్యూ అంటూ లేఖ వచ్చిందని.. అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. భవిష్యత్తులో మోదీ పథకాలపై మరిన్ని లేఖలు రాస్తానని చెబుతోంది అదితి.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







