దసరా పండుగ సందర్భాంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త
- September 18, 2022
హైదరాబాద్: మరో వారం రోజుల్లో దసరా సంబరాలు మొదలు కాబోతున్నాయి. ఈ తరుణంలో ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్న్యూస్ తెలిపింది. హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం.. తెలంగాణ ఆర్టీసీ.. కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా టీఎస్ ఆర్టీసీ సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులకు కట్టిపడేస్తుంది సంగతి తెలిసిందే. ఏ పండగొచ్చిన కానీ ఏ వేడుకైన సరే ప్రయాణికుల కోసం ప్రవైట్ ట్రావెల్స్ కు దీటుగా ఆఫర్లను తీసుకొస్తుంది. ఇక ఇప్పుడు దసరా సందర్బంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం మరో నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 26 వ తేదీ నుంచి శరన్నవ రాత్రులు ప్రారంభం కానుండగా.. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. సుమారు 4 వేల బస్సుల వరకు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. గత ఏడాది ఈ సమయంలో 3300 బస్సుల వరకు నడిపింది. ఇందుకు సంబంధించిన ప్రతి పాదనలను అనుమతి కోసం ఆర్టీసీ అధికారులు సీఎండీ కార్యాలయానికి పంపినట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువైతే..బస్సుల సంఖ్య పెంచేందుకు కూడా సిద్ధం అవుతోంది.
తాజా వార్తలు
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









