షార్జా రాజుతో క్యాథలిక్ చర్చి బిషప్ సహా ఆయన బృందం సమావేశం
- September 18, 2022
షార్జా: షార్జా రాజు హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమిని క్యాథలిక్ చర్చి బిషప్ తో పాటు వారి బృందం కలిసింది. శనివారం అల్ బదీ ప్యాలెస్లో షార్జా రాజుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవలే క్యాథలిక్ చర్చి బిషప్ గా పాలో మారినెల్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కొత్త బిషప్ తో పాటు అంతకుముందున్న బిషప్ పాల్ హెండర్, చర్చికి సంబంధించిన అధికారులు షార్జా రాజును కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై షార్జా రాజు వారితో చర్చలు జరిపారు. ఇతర మతాలను గౌరవించటంతో పాటు పరమత సహనాన్ని ప్రతి ఒక్కరూ అలవార్చుకోవాల్సిన అవసరముందన్నారు. అదే విధంగా కొత్త బిషప్ తన విధులు నిర్వహించటంలో విజయం సాధించాలని రాజు ఆకాంక్షించారు. అటు షార్జా రాజు తమకు అందిస్తున్న సహకారం మరవలేనిదని ఆయనకు రుణపడి ఉంటామని క్యాథలిక్ చర్చి బిషప్ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







