షార్జా రాజుతో క్యాథలిక్ చర్చి బిషప్ సహా ఆయన బృందం సమావేశం
- September 18, 2022
షార్జా: షార్జా రాజు హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమిని క్యాథలిక్ చర్చి బిషప్ తో పాటు వారి బృందం కలిసింది. శనివారం అల్ బదీ ప్యాలెస్లో షార్జా రాజుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవలే క్యాథలిక్ చర్చి బిషప్ గా పాలో మారినెల్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కొత్త బిషప్ తో పాటు అంతకుముందున్న బిషప్ పాల్ హెండర్, చర్చికి సంబంధించిన అధికారులు షార్జా రాజును కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై షార్జా రాజు వారితో చర్చలు జరిపారు. ఇతర మతాలను గౌరవించటంతో పాటు పరమత సహనాన్ని ప్రతి ఒక్కరూ అలవార్చుకోవాల్సిన అవసరముందన్నారు. అదే విధంగా కొత్త బిషప్ తన విధులు నిర్వహించటంలో విజయం సాధించాలని రాజు ఆకాంక్షించారు. అటు షార్జా రాజు తమకు అందిస్తున్న సహకారం మరవలేనిదని ఆయనకు రుణపడి ఉంటామని క్యాథలిక్ చర్చి బిషప్ అన్నారు.
తాజా వార్తలు
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









