షార్జా రాజుతో క్యాథలిక్ చర్చి బిషప్ సహా ఆయన బృందం సమావేశం
- September 18, 2022
షార్జా: షార్జా రాజు హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమిని క్యాథలిక్ చర్చి బిషప్ తో పాటు వారి బృందం కలిసింది. శనివారం అల్ బదీ ప్యాలెస్లో షార్జా రాజుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవలే క్యాథలిక్ చర్చి బిషప్ గా పాలో మారినెల్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కొత్త బిషప్ తో పాటు అంతకుముందున్న బిషప్ పాల్ హెండర్, చర్చికి సంబంధించిన అధికారులు షార్జా రాజును కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై షార్జా రాజు వారితో చర్చలు జరిపారు. ఇతర మతాలను గౌరవించటంతో పాటు పరమత సహనాన్ని ప్రతి ఒక్కరూ అలవార్చుకోవాల్సిన అవసరముందన్నారు. అదే విధంగా కొత్త బిషప్ తన విధులు నిర్వహించటంలో విజయం సాధించాలని రాజు ఆకాంక్షించారు. అటు షార్జా రాజు తమకు అందిస్తున్న సహకారం మరవలేనిదని ఆయనకు రుణపడి ఉంటామని క్యాథలిక్ చర్చి బిషప్ అన్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







