ఫిఫా ప్రపంచ కప్ 2022.. సందర్శకుల ప్రవేశంపై ఖతార్ ఆంక్షలు
- September 22, 2022
ఖతార్: ఫిఫా ప్రపంచ కప్ 2022 నేపథ్యంలో సందర్శకుల ప్రవేశంపై ఖతార్ ఆంక్షలు విధించింది. 2022 నవంబర్ 1 నుండి సందర్శకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధ ఆంక్షలు 2022 డిసెంబర్ 23 వరకు అమల్లో ఉంటాయని సెక్యూరిటీ కమిటీ హెడ్ అబ్దుల్లా ఖలీఫా అల్-ముఫ్తా తెలిపారు. కాగా, హయ్యా కార్డ్ హోల్డర్లు మాత్రం స్వేచ్ఛగా దేశంలోకి ప్రవేశించడంతోపాటు వారు 2023 జనవరి 23 వరకు దేశంలో ఉండవచ్చని టోర్నమెంట్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కమాండర్ కార్యాలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్నల్ జాసిమ్ అల్ సయ్యద్ తెలిపారు. అలాగే ఖతారీ పౌరులు, నివాసితులు, ఖతారీ ID కార్డ్ కలిగి ఉన్న GCC పౌరులు, వ్యక్తిగత వీసాలు, వర్క్ ఎంట్రీ పర్మిట్లను కలిగి ఉన్నవారు, అలాగే ఆమోదించబడిన మానవతా కేసుల వారికి కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాబోయే ప్రపంచ కప్ ఈవెంట్ను విజయవంతంగా నిర్వహించేందుకు జారీ చేసిన చట్టాలు, నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









