యువకున్ని హత్య చేసిన మిలిటరీ వ్యక్తికి మరణ శిక్ష
- September 23, 2022కువైట్: యువకున్ని హత్య చేసిన ఘటనలో మిలటరీలో పనిచేసిన వ్యక్తికి కువైట్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. జులాయి ఏడారిలో ఉన్న ఓ యువకున్ని మిలటరీలో పనిచేస్తున్న వ్యక్తి గొంతు నులిమి చంపాడు. విచారణలో అతను దోషిగా తేలాడు. దీంతో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. కువైట్ లో ఈ ఏడాదిలో ఇదే మొదటి హత్య కేసుగా నమోదైంది. దోషిగా తేలిన వ్యక్తికి గతంలోనూ నేర చరిత్ర ఉంది. హత్యకు కొన్ని వారాల ముందే అతను జైలు నుంచి విడుదలయ్యాడు. వేరే కేసులో అతనికి 15 ఏళ్ల జైలు శిక్ష వేశారు. ఐతే 10 ఏళ్లు శిక్ష అనుభవించిన తర్వాత క్షమాభిక్ష పెట్టటంతో ఇటీవలే విడుదలయ్యాడు. వచ్చిన కొన్ని రోజులకే యువకున్నిహత్య చేశాడు. తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకోవటంతో విచారణ వేగంగా పూర్తైంది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!