మ్యాన్హోల్లో పడ్డ కార్మికుడిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
- September 25, 2022
కువైట్: సభాన్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం మురుగునీటి మ్యాన్హోల్లో పడిన కార్మికుడిని సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ సిబ్బంది వెలికితీశారని జనరల్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా విభాగం తెలిపింది. వర్షాకాలానికి సన్నాహకంగా ఆరో రింగ్రోడ్డులోని సభాన్ ప్రాంతంలో ఉన్న మ్యాన్హోల్ మురుగునీటి వ్యవస్థను శుభ్రం చేస్తుండగా.. ఇద్దరు కార్మికులు అందులో పడిపోయినట్లు కేంద్ర ఆపరేషన్స్ విభాగానికి సమాచారం వచ్చిందన్నారు. వెంటనే అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, మ్యాన్హోల్ వెలుపల ఉన్న కార్మికులలో ఒకరు అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి ప్రథమ చికిత్స అందించారని తెలిపారు. అలాగే మ్యాన్హోల్లో ఉన్న మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసి ఫోరెన్సిక్కు అప్పగించినట్లు జనరల్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









