కూడళ్లలో వాహనాలను నిలిపితే Dh500 జరిమానా
- September 25, 2022
యూఏఈ: కూడళ్లలో వాహనాలను ఆపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి రస్ అల్ ఖైమా(RAK) పోలీసులు శనివారం వాహనదారులను హెచ్చరించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ ని షేర్ చేశారు. కూడళ్లలో వాహనాలను నిలిపి ట్రాఫిక్ కి ఇబ్బందులు కలిగిస్తే 500 దిర్హామ్ జరిమానా విధించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ముఖ్యమైన సమావేశాలు లేదా పనులకు వెళ్లే వారితో సహా ఇతర వాహనదారులకు ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుందని తెలిపారు. అలాగే క్లిష్టమైన ఆరోగ్య స్థితిలో ఉన్న వ్యక్తికి అంబులెన్స్ సేవను ఆలస్యం చేస్తుందని RAK పోలీసులు అవగాహన వీడియోలో తెలిపారు. రోడ్లను అందరికీ సురక్షితంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా ఎమిరేట్స్లోని పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు జారీ చేస్తూ ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను వాహనదారులకు గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







