కూడళ్లలో వాహనాలను నిలిపితే Dh500 జరిమానా

- September 25, 2022 , by Maagulf
కూడళ్లలో వాహనాలను నిలిపితే Dh500 జరిమానా

యూఏఈ: కూడళ్లలో వాహనాలను ఆపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి రస్ అల్ ఖైమా(RAK) పోలీసులు శనివారం వాహనదారులను హెచ్చరించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ని షేర్ చేశారు. కూడళ్లలో వాహనాలను నిలిపి ట్రాఫిక్ కి ఇబ్బందులు కలిగిస్తే 500 దిర్హామ్ జరిమానా విధించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ముఖ్యమైన సమావేశాలు లేదా పనులకు వెళ్లే వారితో సహా ఇతర వాహనదారులకు ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుందని తెలిపారు. అలాగే క్లిష్టమైన ఆరోగ్య స్థితిలో ఉన్న వ్యక్తికి అంబులెన్స్ సేవను ఆలస్యం చేస్తుందని RAK పోలీసులు అవగాహన వీడియోలో తెలిపారు. రోడ్లను అందరికీ సురక్షితంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా ఎమిరేట్స్‌లోని పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు జారీ చేస్తూ ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను వాహనదారులకు గుర్తు చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com