కూడళ్లలో వాహనాలను నిలిపితే Dh500 జరిమానా
- September 25, 2022
యూఏఈ: కూడళ్లలో వాహనాలను ఆపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి రస్ అల్ ఖైమా(RAK) పోలీసులు శనివారం వాహనదారులను హెచ్చరించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ ని షేర్ చేశారు. కూడళ్లలో వాహనాలను నిలిపి ట్రాఫిక్ కి ఇబ్బందులు కలిగిస్తే 500 దిర్హామ్ జరిమానా విధించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ముఖ్యమైన సమావేశాలు లేదా పనులకు వెళ్లే వారితో సహా ఇతర వాహనదారులకు ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుందని తెలిపారు. అలాగే క్లిష్టమైన ఆరోగ్య స్థితిలో ఉన్న వ్యక్తికి అంబులెన్స్ సేవను ఆలస్యం చేస్తుందని RAK పోలీసులు అవగాహన వీడియోలో తెలిపారు. రోడ్లను అందరికీ సురక్షితంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా ఎమిరేట్స్లోని పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు జారీ చేస్తూ ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను వాహనదారులకు గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









